ఒక క్రికెటర్ గా ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ కు ఎంత పేరుందో మన తెలుగు సినిమాల పాటలకు డాన్సు రీల్స్ చేయడం ద్వారా అంతే పాపులారిటీ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప 1 టైంలో తన వీడియోలు మాములు వైరల్ కాలేదు. అందుకే ఈసారి ఏకంగా టాలీవుడ్ తెరమీదకు తీసుకొస్తున్నారు. నితిన్ రాబిన్ హుడ్ లో వార్నర్ నటించిన సంగతి తెలిసిందే. పెద్ద ఎపిసోడ్ కాదు కానీ ఒక ముఖ్యమైన సీన్లో నటించినందుకు గాను అతనికి రెండున్నర కోట్లు ఇచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. ఇది ఒక టయర్ 3 సోలో హీరో రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ. ట్విస్ట్ ఏంటంటే ఈసారి ఐపీఎల్ లో అతన్ని ఎవరూ కొనలేదు.
సరే ఇంత ఖర్చు పెట్టాం కదా గిట్టుబాటు అయితే చాలనేది నిర్మాతల ఉద్దేశం. అయితే ఫ్యాన్స్ ఎక్కువ ఊహించుకునేలా డేవిడ్ వార్నర్ పాత్ర ఉండదని ఇన్ సైడ్ టాక్. తక్కువ డైలాగులతో జస్ట్ కాసేపు కనిపించి వెళ్లిపోయేలా దర్శకుడు వెంకీ కుడుముల ఆ పాత్రని డిజైన్ చేసినట్టు సమాచారం. ఆ మధ్య రాజమౌళి నటించిన ఒక క్రెడిట్ కార్డు ప్రకటనలో వార్నర్ ను వాడుకున్నారు కదా. అచ్చం అదే స్టైల్ లో ఉంటుందట. అయితే గతంలోలా వార్నర్ కు అంత ఫాలోయింగ్ ఇప్పుడు లేదు. ట్రావిస్ హెడ్, విలియంసన్, రచిన్ రవీంద్ర, కమిన్స్ తో పోలిస్తే మనోడు బాగా వెనుకబడ్డాడు. క్రికెట్ ఫామ్ కూడా బాగా తగ్గిపోయింది.
సో ఏదో అద్భుతం జరిగిపోతుందని కాకుండా డేవిడ్ వార్నర్ ని జస్ట్ ఎంజాయ్ కోణంలోనే మాత్రమే చూడాలని టీమ్ ఆశిస్తోంది. మార్చి 28 విడుదలకు రెడీ అవుతున్న రాబిన్ హుడ్ మీద ప్రమోషన్ల వల్ల మంచి బజ్ వచ్చేసింది. ఇంకా ట్రైలర్ బాకీ ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ పరంగా నితిన్ కెరీర్ లో ఇప్పటిదాకా హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. శ్రీలీల హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఎల్2 ఎంపురాన్, వీరధీరశూర పార్ట్ 2, మ్యాడ్ స్క్వేర్ తో పోటీ పడుతున్న రాబిన్ హుడ్ బాక్సాఫీస్ కు కొత్త జోష్ తీసుకొస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on March 21, 2025 1:18 pm
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…