ఒక క్రికెటర్ గా ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ కు ఎంత పేరుందో మన తెలుగు సినిమాల పాటలకు డాన్సు రీల్స్ చేయడం ద్వారా అంతే పాపులారిటీ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప 1 టైంలో తన వీడియోలు మాములు వైరల్ కాలేదు. అందుకే ఈసారి ఏకంగా టాలీవుడ్ తెరమీదకు తీసుకొస్తున్నారు. నితిన్ రాబిన్ హుడ్ లో వార్నర్ నటించిన సంగతి తెలిసిందే. పెద్ద ఎపిసోడ్ కాదు కానీ ఒక ముఖ్యమైన సీన్లో నటించినందుకు గాను అతనికి రెండున్నర కోట్లు ఇచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. ఇది ఒక టయర్ 3 సోలో హీరో రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ. ట్విస్ట్ ఏంటంటే ఈసారి ఐపీఎల్ లో అతన్ని ఎవరూ కొనలేదు.
సరే ఇంత ఖర్చు పెట్టాం కదా గిట్టుబాటు అయితే చాలనేది నిర్మాతల ఉద్దేశం. అయితే ఫ్యాన్స్ ఎక్కువ ఊహించుకునేలా డేవిడ్ వార్నర్ పాత్ర ఉండదని ఇన్ సైడ్ టాక్. తక్కువ డైలాగులతో జస్ట్ కాసేపు కనిపించి వెళ్లిపోయేలా దర్శకుడు వెంకీ కుడుముల ఆ పాత్రని డిజైన్ చేసినట్టు సమాచారం. ఆ మధ్య రాజమౌళి నటించిన ఒక క్రెడిట్ కార్డు ప్రకటనలో వార్నర్ ను వాడుకున్నారు కదా. అచ్చం అదే స్టైల్ లో ఉంటుందట. అయితే గతంలోలా వార్నర్ కు అంత ఫాలోయింగ్ ఇప్పుడు లేదు. ట్రావిస్ హెడ్, విలియంసన్, రచిన్ రవీంద్ర, కమిన్స్ తో పోలిస్తే మనోడు బాగా వెనుకబడ్డాడు. క్రికెట్ ఫామ్ కూడా బాగా తగ్గిపోయింది.
సో ఏదో అద్భుతం జరిగిపోతుందని కాకుండా డేవిడ్ వార్నర్ ని జస్ట్ ఎంజాయ్ కోణంలోనే మాత్రమే చూడాలని టీమ్ ఆశిస్తోంది. మార్చి 28 విడుదలకు రెడీ అవుతున్న రాబిన్ హుడ్ మీద ప్రమోషన్ల వల్ల మంచి బజ్ వచ్చేసింది. ఇంకా ట్రైలర్ బాకీ ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ పరంగా నితిన్ కెరీర్ లో ఇప్పటిదాకా హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. శ్రీలీల హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఎల్2 ఎంపురాన్, వీరధీరశూర పార్ట్ 2, మ్యాడ్ స్క్వేర్ తో పోటీ పడుతున్న రాబిన్ హుడ్ బాక్సాఫీస్ కు కొత్త జోష్ తీసుకొస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…