Movie News

పవన్ కళ్యాణ్ కాదు జూనియర్ ఎన్టీఆరే – నాగవంశీ

టాలీవుడ్ లో ప్రస్తుతమున్న వాటిలో మోస్ట్ ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌసెస్ గా చెప్పుకునే వాటిలో సితార ఎంటర్ టైన్మెంట్స్ ముందు వరుసలో ఉంది. వేగంగా సినిమాలు తీయడమే కాదు సక్సెస్ రేట్ కూడా ఘనంగా కొనసాగిస్తున్న ఈ నిర్మాణ సంస్థను నిర్మాత నాగవంశీ నడిపిస్తున్న తీరు వరస హిట్లను ఇస్తోంది. మార్చి 28 మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది. రాబిన్ హుడ్, ఎల్2 ఎంపురాన్, వీరధీరశూర పార్ట్ 2తో పోటీ చాలా టఫ్ ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో ముందుకెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో మీడియా జర్నలిస్టులతో కాకుండా సినిమాలో నటించిన హీరోతో వెరైటీ ఇంటర్వ్యూ చేశారు. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి.

సితార 50వ సినిమాకు దగ్గరలో ఉంది. ఏ బ్యానర్ కైనా ఇది చాలా ప్రతిష్టాత్మకమైన నెంబర్. అందుకే బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా క్రేజీ మూవీ తీయాలని ప్లాన్ చేసుకుంటారు. ఇదే ప్రస్తావన సంగీత్ శోభన్ తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరితో ఒకరితో మాత్రమే 50వ మూవీ తీయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారనేది ప్రశ్న. దానికి నాగవంశీ సమాధానమిస్తూ పవన్ ఉన్న స్థాయికి ఇకపై రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తారు, ఇంకా పెద్ద పొజిషన్లకు ఎప్పుడు వెళ్తారు అని కోరుకోవాలి తప్పించి సినిమా తీయాలని కాదని, అలా ఛాయస్ పెట్టుకుంటే తారక్ కే ప్రాధాన్యం అంటూ కుండ బద్దలు కొట్టారు.

నాగవంశీ చెప్పింది చాలా ప్రాక్టికల్ యాంగిల్. ఎందుకంటే పవన్ బాలన్స్ ఉన్న మూడు సినిమాలకు డేట్లు ఇవ్వడానికే టైం చాలక ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు కొత్త కమిట్ మెంట్స్ అంటే జరగని పని. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పని భారం చాలా ఎక్కువగా ఉంది. అందులోనూ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు. డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలకు బాధ్యులుగా ఉంటూ జనసేనని మరింత బలోపేతం చేసే బాధ్యతతో ఉన్నారు. సో సితార ప్రెస్టీజియస్ మూవీకి పవన్ కళ్యాణ్ కన్నా జూనియర్ ఎన్టీఆరే బెటర్ ఛాయస్ అవుతాడని ఆయన అన్న మాటకు ఎవరి అభిమాని అయినా రైటనే అంటారు.

This post was last modified on March 20, 2025 8:08 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

49 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago