టాలీవుడ్ లో ప్రస్తుతమున్న వాటిలో మోస్ట్ ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌసెస్ గా చెప్పుకునే వాటిలో సితార ఎంటర్ టైన్మెంట్స్ ముందు వరుసలో ఉంది. వేగంగా సినిమాలు తీయడమే కాదు సక్సెస్ రేట్ కూడా ఘనంగా కొనసాగిస్తున్న ఈ నిర్మాణ సంస్థను నిర్మాత నాగవంశీ నడిపిస్తున్న తీరు వరస హిట్లను ఇస్తోంది. మార్చి 28 మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది. రాబిన్ హుడ్, ఎల్2 ఎంపురాన్, వీరధీరశూర పార్ట్ 2తో పోటీ చాలా టఫ్ ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో ముందుకెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో మీడియా జర్నలిస్టులతో కాకుండా సినిమాలో నటించిన హీరోతో వెరైటీ ఇంటర్వ్యూ చేశారు. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి.
సితార 50వ సినిమాకు దగ్గరలో ఉంది. ఏ బ్యానర్ కైనా ఇది చాలా ప్రతిష్టాత్మకమైన నెంబర్. అందుకే బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా క్రేజీ మూవీ తీయాలని ప్లాన్ చేసుకుంటారు. ఇదే ప్రస్తావన సంగీత్ శోభన్ తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరితో ఒకరితో మాత్రమే 50వ మూవీ తీయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారనేది ప్రశ్న. దానికి నాగవంశీ సమాధానమిస్తూ పవన్ ఉన్న స్థాయికి ఇకపై రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తారు, ఇంకా పెద్ద పొజిషన్లకు ఎప్పుడు వెళ్తారు అని కోరుకోవాలి తప్పించి సినిమా తీయాలని కాదని, అలా ఛాయస్ పెట్టుకుంటే తారక్ కే ప్రాధాన్యం అంటూ కుండ బద్దలు కొట్టారు.
నాగవంశీ చెప్పింది చాలా ప్రాక్టికల్ యాంగిల్. ఎందుకంటే పవన్ బాలన్స్ ఉన్న మూడు సినిమాలకు డేట్లు ఇవ్వడానికే టైం చాలక ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు కొత్త కమిట్ మెంట్స్ అంటే జరగని పని. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పని భారం చాలా ఎక్కువగా ఉంది. అందులోనూ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు. డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలకు బాధ్యులుగా ఉంటూ జనసేనని మరింత బలోపేతం చేసే బాధ్యతతో ఉన్నారు. సో సితార ప్రెస్టీజియస్ మూవీకి పవన్ కళ్యాణ్ కన్నా జూనియర్ ఎన్టీఆరే బెటర్ ఛాయస్ అవుతాడని ఆయన అన్న మాటకు ఎవరి అభిమాని అయినా రైటనే అంటారు.
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…
ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…