రాజకీయాలకు-సినిమా ఇండస్ట్రీకి మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్తో ప్రారంభమైన సినీ రాజకీయాలు.. నిన్న మొన్నటి వరకు సాగుతూనే ఉన్నాయి. చాలా మంది నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా రాజకీయాలు చేశారు. తమ పేరును చాటుకున్నారు. దాసరి నారాయణరావు, కృష్ణ, రామానాయుడు, శారద ఇలా చాలా మంది రాజకీయ అరంగేట్రం చేసి తమ సత్తా చాటారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి.
ఒకప్పుడు టాలీవుడ్ కోసం రాజకీయ నాయకులు కూడా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు టాలీవుడ్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పైగా.. నటులు నిర్మాతలు కూడా.. వెనక్కి తగ్గు తున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటు ఏపీలో, అటు తెలంగాణలో కూడా టాలీవుడ్ నుంచి ఇప్పుడు రాజకీయాలపై సందడి తగ్గిందనే చెప్పాలి. ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయడం.. మరో పార్టీ అధికారంలోకి రావడంతో నాయకులు, దర్శకులు, నిర్మాతల పరిస్థితి మార్పుచెందుతోంది.
వేధింపులు, కక్ష సాధింపులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నాయన్నది టాలీవుడ్ చెబుతున్న మాట. తాజాగా అంతర్గత సమావేశంలో తెలంగాణ సినీ ఇండస్ట్రీ ఇదే అభిప్రాయం వెల్లడించింది. గతంలో బీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు దర్శకులు ఇప్పుడు సినిమాలు తీసుకునేందుకు లొకేషన్లు లభించని పరిస్థితి ఏర్పడడంతో అత్యంత రహస్యంగా ఈ భేటీ నిర్వహించారు. అలాగని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే.. మళ్లీ బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే.. తమ పరిస్థితి ఏంటని వారు తల్లడిల్లుతున్నారు.
ఇక, ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా తటస్థంగా మారుతున్నారు. వైసీపీని సమర్ధించిన నటులు, దర్శకులు ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఒకరిద్దరు కేసులు ఎదుర్కొంటున్నారు. దీంతో అసలు రాజకీయాలు ఎందుకు? అనే ధోరణి టాలీవుడ్లో పెరిగిపోయింది. ఇదిలావుంటే.. గతంలో మాదిరిగా.. నటులు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు ఓటేస్తారన్న సంస్కృతి కూడా పోయింది. దీంతో టాలీవుడ్ దాదాపు రాజకీయాలకు స్వస్తి చెప్పే దిశగానే అడుగులు వేస్తుండడం గమనార్హం.
This post was last modified on March 20, 2025 4:54 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…