రాజకీయాలకు-సినిమా ఇండస్ట్రీకి మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్తో ప్రారంభమైన సినీ రాజకీయాలు.. నిన్న మొన్నటి వరకు సాగుతూనే ఉన్నాయి. చాలా మంది నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా రాజకీయాలు చేశారు. తమ పేరును చాటుకున్నారు. దాసరి నారాయణరావు, కృష్ణ, రామానాయుడు, శారద ఇలా చాలా మంది రాజకీయ అరంగేట్రం చేసి తమ సత్తా చాటారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి.
ఒకప్పుడు టాలీవుడ్ కోసం రాజకీయ నాయకులు కూడా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు టాలీవుడ్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పైగా.. నటులు నిర్మాతలు కూడా.. వెనక్కి తగ్గు తున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటు ఏపీలో, అటు తెలంగాణలో కూడా టాలీవుడ్ నుంచి ఇప్పుడు రాజకీయాలపై సందడి తగ్గిందనే చెప్పాలి. ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయడం.. మరో పార్టీ అధికారంలోకి రావడంతో నాయకులు, దర్శకులు, నిర్మాతల పరిస్థితి మార్పుచెందుతోంది.
వేధింపులు, కక్ష సాధింపులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నాయన్నది టాలీవుడ్ చెబుతున్న మాట. తాజాగా అంతర్గత సమావేశంలో తెలంగాణ సినీ ఇండస్ట్రీ ఇదే అభిప్రాయం వెల్లడించింది. గతంలో బీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు దర్శకులు ఇప్పుడు సినిమాలు తీసుకునేందుకు లొకేషన్లు లభించని పరిస్థితి ఏర్పడడంతో అత్యంత రహస్యంగా ఈ భేటీ నిర్వహించారు. అలాగని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే.. మళ్లీ బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే.. తమ పరిస్థితి ఏంటని వారు తల్లడిల్లుతున్నారు.
ఇక, ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా తటస్థంగా మారుతున్నారు. వైసీపీని సమర్ధించిన నటులు, దర్శకులు ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఒకరిద్దరు కేసులు ఎదుర్కొంటున్నారు. దీంతో అసలు రాజకీయాలు ఎందుకు? అనే ధోరణి టాలీవుడ్లో పెరిగిపోయింది. ఇదిలావుంటే.. గతంలో మాదిరిగా.. నటులు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు ఓటేస్తారన్న సంస్కృతి కూడా పోయింది. దీంతో టాలీవుడ్ దాదాపు రాజకీయాలకు స్వస్తి చెప్పే దిశగానే అడుగులు వేస్తుండడం గమనార్హం.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…