గత వారం కోర్ట్ రూపంలో ఒక చిన్న సినిమాకు పెద్ద విజయం దక్కడం చూసి బాక్సాఫీస్ హ్యాపీగా ఉంది. ఎంత నిర్మాత నాని అయినప్పటికీ కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించే ట్రెండ్ లో ఎక్కువ శాతం కొత్తవాళ్లు నటించిన సీరియస్ డ్రామాకు వారం తిరక్కుండానే ముప్పై కోట్ల వసూళ్లు దాటడం చిన్న విషయం కాదు. ఈ నేపథ్యంలో రేపు మార్చి 21 ఏకంగా ఏడుకి పైగా చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. కమెడియన్ సప్తగిరి ‘పెళ్లి కాని ప్రసాద్’కి ప్రమోషన్లు బాగానే జరిగాయి. కంటెంట్ మీద నమ్మకంతో ఇవాళ హైదరాబాద్ లో మూడు ప్రీమియర్లు వేస్తున్నారు.
ఈ మధ్య కనిపించడం తగ్గించిన ఆది సాయికుమార్ ‘షణ్ముఖ’గా వస్తున్నాడు. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీకి పెద్దగా పబ్లిసిటీ చేస్తున్న దాఖలాలు లేవు. దర్శక నిర్మాతలు మాత్రం హిట్టు పట్ల ధీమాగా ఉన్నారు. కోర్ట్ తో పేరు తెచ్చుకున్న హర్ష్ రోషన్ ఒక ప్రధాన పాత్ర పోషించిన ‘టుక్ టుక్’ ఏదో వెరైటీ కాన్సెప్ట్ తో రూపొందింది. టాక్ బాగుంటే జనాన్ని ఆశించవచ్చు. విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ‘అనగనగా ఆస్ట్రేలియా’ రేపే వస్తోంది. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మరో రెండు చిత్రాలు ఆర్టిస్ట్, ది సస్పెక్ట్ బరిలో ఉన్నాయి. వెరైటీ టైటిల్ పెట్టుకున్న బాలీవుడ్ డబ్బింగ్ ‘కిస్ కిస్ కిసిక్’కి హడావిడి చేస్తున్నారు..
ఇవి కాకుండా రెండు రీ రిలీజులు వస్తున్నాయి. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఎవడే సుబ్రమణ్యం’కు మరోసారి ఆదరణ దక్కుతుందనే నమ్మకం వైజయంతి మూవీస్ టీమ్ లో ఉంది. రెండేళ్లు తిరక్కుండానే తీసుకొస్తున్నా ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ బుకింగ్స్ ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అడ్వాన్స్ లోనే కోటి రూపాయలు గ్రాస్ దాటడం రికార్డే. వీటితో పాటు కోర్ట్ రెండో వారంలోనూ స్ట్రాంగ్ గా కొనసాగనుంది. చాలా సెంటర్లలో సెకండ్ వీకెండ్ కి స్క్రీన్లు పెంచుతున్నారు. వచ్చే వారం పెద్ద సినిమాలు క్యూ కట్టిన నేపథ్యంలో ఇప్పుడొచ్చేవన్నీ ఎక్స్ ట్రాడినరి టాక్ తో మెప్పించగలిగితేనే నిలబడతాయి.
This post was last modified on March 20, 2025 3:56 pm
తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టిన చాలామంది ఉత్తరాది హీరోయిన్లు ఇక్కడి అమ్మాయిల్లా మారిపోయిన వారే. అందరికీ నమస్కారం అని కష్టపడి…
మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. ఎల్-2: ఎంపురాన్. ఆ ఇండస్ట్రీలో అత్యధిక హైప్ తెచ్చుకున్న సినిమా కూడా…
విశాఖపట్టణంలోని సుందర తీరం రిషికొండ బీచ్ కు తిరిగి బ్లూఫాగ్ గుర్తింపు దక్కింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఈ…
ఏపీలోని కూటమి ప్రభుత్వం.. త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన చేస్తుందా? లేక.. మంత్రివర్గంలో కూర్పు వరకు పరిమితం అవుతుందా? అంటే..…
అగ్ర రాజ్యం అమెరికాలో డబ్బులిచ్చి పౌరసత్వం కొనుక్కొనే వెసులుబాటు అప్పుడే మొదలైపోయింది. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే... గోల్డ్ కార్డ్…
పీకే.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటి. 2014లో వచ్చిన ఈ చిత్రం ఆల్ టైం బ్లాక్…