బాలీవుడ్ ప్రముఖుల కామెంట్లు ఒక్కోసారి భలే విచిత్రంగా ఉంటాయి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి, ఒకప్పటి మాజీ హీరోయిన్ జయా బచ్చన్ ప్రస్తుతం ఈ లిస్టులో చేరారు. ఇటీవలే ఆవిడ జాతీయ మీడియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ టైటిల్ తనకు అస్సలు నచ్చలేదని, అసలు ఇలాంటి పేర్లు ఉంటే మీలో ఎంత మంది చూస్తారని ప్రశ్నిస్తే నాలుగురైదుగురు మాత్రమే చేతులెత్తారు. దీంతో చూశారా ఇక్కడే ఇలాంటి స్పందన వచ్చిందంటే టాయిలెట్ ఫ్లాప్ అంటూ తీర్పు ఇచ్చేశారు. ఇది కేవలం ప్రచారం కోసం చూసిన చిత్రమంటూ తేల్చి చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
నిజానికి టాయిలెట్ ఎక్ ప్రేమ్ కథ 200 కోట్లకు పైగా వసూలు చేసిన సూపర్ హిట్ మూవీ. గ్రామంలో భార్య పడుతున్న ఇబ్బందిని చూసి ఓ యువకుడు మరుగుదొడ్లను కట్టించేందుకు ఏం చేశాడనే పాయింట్ మీద వినోదాత్మకంగా రూపొందించారు దర్శకుడు శ్రీ నారాయణ సింగ్. స్వచ్ భారత్ ఉద్యమానికి మద్దతుగా నిర్మించిన చిత్రమే అయినా ప్రేక్షకులు ఆదరించారు. అందులో సందేశాన్ని అర్థం చేసుకున్నారు. అక్షయ్ కుమార్ కెరీర్ లోనే చెప్పుకోదగ్గ క్లాసిక్ గా టాయిలెట్ నిలిచింది. అయినా భూమ్మీద ప్రతి మనిషి ఉదయం లేవగానే వెళ్లే ప్రకృతి కార్యక్రమం నిర్వహించే రూముని టైటిల్ గా పెట్టుకుంటే ఇంత ఎగతాళి ఎందుకో మరి.
జయా బచ్చన్ వెర్షన్ మీద అప్పుడే నెటిజెన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొడుకు అభిషేక్ బచ్చన్ స్టార్ కాలేకపోయాడనే అసంతృప్తితో ఆవిడ ఇలా మాట్లాడి ఉండొచ్చని కొందరు అంటుండగా అసలు టాయిలెట్ ని చూసి ఉంటే ఇలా నెగటివ్ గా మాట్లాడే వారు కాదని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా పబ్లిక్ డొమైన్, బాక్సాఫీస్ ఆదరించిన సినిమాని ఇలా ఓపెన్ స్టేజి మీద ఫ్లాపని చెప్పడం విచిత్రమే. అయినా తొమ్మిది సంవత్సరాల క్రితం 2019లో రిలీజైన టాయిలెట్ గురించి ఇప్పుడు అదే పనిగా ప్రస్తావించి ఫ్లాప్ అనడం వెనుక పరమార్థం ఏమై ఉంటుందో లోగుట్టు పెరుమాళ్లకెరుక.
This post was last modified on March 19, 2025 7:16 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…