గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల రీచ్ రావడమే కాక యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయి వసూళ్లు కూడా వచ్చాయి. అప్పటి నుంచే హీరోయిన్ మమిత బైజు మనోళ్లకు దగ్గరయ్యింది. తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ అమ్మడికి విజయ్ జన నాయగన్ లో ఛాన్సు దక్కిన సంగతి తెలిసిందే. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ భగవంత్ కేసరి రీమేక్ గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో శ్రీలీల తరహా కీలక పాత్ర చేస్తోందనే టాక్ చెన్నై వర్గాల్లో ఉంది. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది.
తాజాగా సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో మమితనే తీసుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుని సితార ఎంటర్ టైన్మెంట్స్ తెరకెక్కించబోతోంది. రెట్రో రిలీజ్ తర్వాత ఆర్జె బాలాజీతో తన 45వ సినిమా పూర్తి చేశాక సూర్య దీని సెట్లలో అడుగు పెట్టొచ్చని టాక్. వెట్రిమారన్ తో లాక్ చేసుకున్న వాడివాసల్ ఇంకొంచెం ఆలస్యం అయ్యేలా ఉండటంతో ఈలోగా అట్లూరిది పూర్తి చేస్తారని వినికిడి. ముందు సూర్య జోడీగా భాగ్యశ్రీ బోర్సేని అనుకున్నారు కానీ తర్వాత ఏవో కారణాల వల్ల మమిత బైజుని తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది.
ప్రేమలు సక్సెస్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న మమిత బైజుకు జివి ప్రకాష్ తో చేసిన రెబెల్ డిజాస్టర్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇండస్ట్రీకి వచ్చింది 2017లో అయినా తొలి బ్రేక్ దక్కడానికి మమితకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది. అందుకే దీన్ని కాపాడుకునే క్రమంలో అందరికీ ఎస్ చెప్పడం లేదు. అయితే సూర్య సినిమాలో హీరోయినా లేక జన నాయగన్ తరహాలో ఏదైనా ముఖ్యమైన లీడా అనేది తెలియాల్సి ఉంది. సార్, లక్కీ భాస్కర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ల తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న చిత్రం ఇదే కావడంతో అంచనాల పరంగా పెద్ద బరువే మోస్తోంది. వేసవిలోనే ప్రారంభించే అవకాశాలున్నాయి.
This post was last modified on March 19, 2025 12:12 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…