గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల రీచ్ రావడమే కాక యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయి వసూళ్లు కూడా వచ్చాయి. అప్పటి నుంచే హీరోయిన్ మమిత బైజు మనోళ్లకు దగ్గరయ్యింది. తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ అమ్మడికి విజయ్ జన నాయగన్ లో ఛాన్సు దక్కిన సంగతి తెలిసిందే. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ భగవంత్ కేసరి రీమేక్ గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో శ్రీలీల తరహా కీలక పాత్ర చేస్తోందనే టాక్ చెన్నై వర్గాల్లో ఉంది. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది.
తాజాగా సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో మమితనే తీసుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుని సితార ఎంటర్ టైన్మెంట్స్ తెరకెక్కించబోతోంది. రెట్రో రిలీజ్ తర్వాత ఆర్జె బాలాజీతో తన 45వ సినిమా పూర్తి చేశాక సూర్య దీని సెట్లలో అడుగు పెట్టొచ్చని టాక్. వెట్రిమారన్ తో లాక్ చేసుకున్న వాడివాసల్ ఇంకొంచెం ఆలస్యం అయ్యేలా ఉండటంతో ఈలోగా అట్లూరిది పూర్తి చేస్తారని వినికిడి. ముందు సూర్య జోడీగా భాగ్యశ్రీ బోర్సేని అనుకున్నారు కానీ తర్వాత ఏవో కారణాల వల్ల మమిత బైజుని తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది.
ప్రేమలు సక్సెస్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న మమిత బైజుకు జివి ప్రకాష్ తో చేసిన రెబెల్ డిజాస్టర్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇండస్ట్రీకి వచ్చింది 2017లో అయినా తొలి బ్రేక్ దక్కడానికి మమితకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది. అందుకే దీన్ని కాపాడుకునే క్రమంలో అందరికీ ఎస్ చెప్పడం లేదు. అయితే సూర్య సినిమాలో హీరోయినా లేక జన నాయగన్ తరహాలో ఏదైనా ముఖ్యమైన లీడా అనేది తెలియాల్సి ఉంది. సార్, లక్కీ భాస్కర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ల తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న చిత్రం ఇదే కావడంతో అంచనాల పరంగా పెద్ద బరువే మోస్తోంది. వేసవిలోనే ప్రారంభించే అవకాశాలున్నాయి.
This post was last modified on March 19, 2025 12:12 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…