సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని బాలీవుడ్ రిపోర్ట్. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోమని పురమాయించారట. అయితే ఆ రోజు ఆదివారం. మాములుగా రిలీజులకు అనుకూలంగా ఉండే ఫ్రైడే కాకుండా సండే ఎంచుకోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే రంజాన్ ఉపవాసాలు పూర్తయి నెలవంక వచ్చే అవకాశం ఉన్నది ఆ రోజే కాబట్టి ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చట. కానీ రెండు రోజులు ముందే రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అది ఉభయకుశలోపరిగా ఉంటుందనేది మరో వెర్షన్.
ఇప్పటికే సికందర్ మీద ప్రీ నెగటివ్ టాక్ జోరుగా ఉంది. టీజర్, పాటల ప్రోమోల మీద ట్రోలింగ్ జరిగింది. సల్మాన్ లుక్స్ మీద కామెంట్స్ చాలా వచ్చాయి. విఎఫెక్స్ తో డాన్స్ చేయించారని అన్నవాళ్ళు లేకపోలేదు. వీటికి తోడు సాంగ్స్ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవనేది ఇంకో ఫీడ్ బ్యాక్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మార్చి 28 వద్దనుకున్నారేమో టీమ్ కే తెలియాలి. ఎందుకంటే శుక్రవారం వచ్చి టాక్ కొంచెం అటు ఇటు అయితే వీకెండ్ నుంచే దెబ్బ పడుతుంది. అలా కాకుండా సండే వస్తే రిస్క్ తగ్గుతుంది. అయినా కంటెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు ఏ రోజైనా ఒకటేగా అనే లాజిక్ మర్చిపోకూడదు.
ఇదిలా ఉంచితే దర్శకుడు మురుగదాస్ కు ఈ సక్సెస్ చాలా కీలకం. గజిని, హాలిడే తర్వాత బాలీవుడ్ లో చాలా గ్యాప్ తీసుకున్నాడు. పైగా సౌత్ లో స్టార్ హీరోలు ఆయన్ని పక్కన పెట్టారు. సికందర్ తో ఋజువు చేసుకుంటే శివ కార్తికేయన్ తో తీస్తున్న మదరాసి మార్కెట్ కు ఉపయోగపడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే లక్కీ గర్ల్ రష్మిక మందన్న హీరోయిన్ కావడం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. పాత్ర పరంగా రొటీన్ గానే ఉండొచ్చు కానీ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న తన ట్రాక్ రికార్డు దీనికి ఉపయోగపడితే కండల వీరుడికి ప్లస్ అవుతుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సికందర్ డబ్బింగ్ చేస్తారా లేదానేది ఇంకా తేల్చలేదు.
This post was last modified on March 19, 2025 10:09 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…