Movie News

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని బాలీవుడ్ రిపోర్ట్. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోమని పురమాయించారట. అయితే ఆ రోజు ఆదివారం. మాములుగా రిలీజులకు అనుకూలంగా ఉండే ఫ్రైడే కాకుండా సండే ఎంచుకోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే రంజాన్ ఉపవాసాలు పూర్తయి నెలవంక వచ్చే అవకాశం ఉన్నది ఆ రోజే కాబట్టి ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చట. కానీ రెండు రోజులు ముందే రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అది ఉభయకుశలోపరిగా ఉంటుందనేది మరో వెర్షన్.

ఇప్పటికే సికందర్ మీద ప్రీ నెగటివ్ టాక్ జోరుగా ఉంది. టీజర్, పాటల ప్రోమోల మీద ట్రోలింగ్ జరిగింది. సల్మాన్ లుక్స్ మీద కామెంట్స్ చాలా వచ్చాయి. విఎఫెక్స్ తో డాన్స్ చేయించారని అన్నవాళ్ళు లేకపోలేదు. వీటికి తోడు సాంగ్స్ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవనేది ఇంకో ఫీడ్ బ్యాక్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మార్చి 28 వద్దనుకున్నారేమో టీమ్ కే తెలియాలి. ఎందుకంటే శుక్రవారం వచ్చి టాక్ కొంచెం అటు ఇటు అయితే వీకెండ్ నుంచే దెబ్బ పడుతుంది. అలా కాకుండా సండే వస్తే రిస్క్ తగ్గుతుంది. అయినా కంటెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు ఏ రోజైనా ఒకటేగా అనే లాజిక్ మర్చిపోకూడదు.

ఇదిలా ఉంచితే దర్శకుడు మురుగదాస్ కు ఈ సక్సెస్ చాలా కీలకం. గజిని, హాలిడే తర్వాత బాలీవుడ్ లో చాలా గ్యాప్ తీసుకున్నాడు. పైగా సౌత్ లో స్టార్ హీరోలు ఆయన్ని పక్కన పెట్టారు. సికందర్ తో ఋజువు చేసుకుంటే శివ కార్తికేయన్ తో తీస్తున్న మదరాసి మార్కెట్ కు ఉపయోగపడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే లక్కీ గర్ల్ రష్మిక మందన్న హీరోయిన్ కావడం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. పాత్ర పరంగా రొటీన్ గానే ఉండొచ్చు కానీ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న తన ట్రాక్ రికార్డు దీనికి ఉపయోగపడితే కండల వీరుడికి ప్లస్ అవుతుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సికందర్ డబ్బింగ్ చేస్తారా లేదానేది ఇంకా తేల్చలేదు.

This post was last modified on March 19, 2025 10:09 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

44 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago