సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని బాలీవుడ్ రిపోర్ట్. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోమని పురమాయించారట. అయితే ఆ రోజు ఆదివారం. మాములుగా రిలీజులకు అనుకూలంగా ఉండే ఫ్రైడే కాకుండా సండే ఎంచుకోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే రంజాన్ ఉపవాసాలు పూర్తయి నెలవంక వచ్చే అవకాశం ఉన్నది ఆ రోజే కాబట్టి ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చట. కానీ రెండు రోజులు ముందే రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అది ఉభయకుశలోపరిగా ఉంటుందనేది మరో వెర్షన్.
ఇప్పటికే సికందర్ మీద ప్రీ నెగటివ్ టాక్ జోరుగా ఉంది. టీజర్, పాటల ప్రోమోల మీద ట్రోలింగ్ జరిగింది. సల్మాన్ లుక్స్ మీద కామెంట్స్ చాలా వచ్చాయి. విఎఫెక్స్ తో డాన్స్ చేయించారని అన్నవాళ్ళు లేకపోలేదు. వీటికి తోడు సాంగ్స్ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవనేది ఇంకో ఫీడ్ బ్యాక్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మార్చి 28 వద్దనుకున్నారేమో టీమ్ కే తెలియాలి. ఎందుకంటే శుక్రవారం వచ్చి టాక్ కొంచెం అటు ఇటు అయితే వీకెండ్ నుంచే దెబ్బ పడుతుంది. అలా కాకుండా సండే వస్తే రిస్క్ తగ్గుతుంది. అయినా కంటెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు ఏ రోజైనా ఒకటేగా అనే లాజిక్ మర్చిపోకూడదు.
ఇదిలా ఉంచితే దర్శకుడు మురుగదాస్ కు ఈ సక్సెస్ చాలా కీలకం. గజిని, హాలిడే తర్వాత బాలీవుడ్ లో చాలా గ్యాప్ తీసుకున్నాడు. పైగా సౌత్ లో స్టార్ హీరోలు ఆయన్ని పక్కన పెట్టారు. సికందర్ తో ఋజువు చేసుకుంటే శివ కార్తికేయన్ తో తీస్తున్న మదరాసి మార్కెట్ కు ఉపయోగపడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే లక్కీ గర్ల్ రష్మిక మందన్న హీరోయిన్ కావడం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. పాత్ర పరంగా రొటీన్ గానే ఉండొచ్చు కానీ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న తన ట్రాక్ రికార్డు దీనికి ఉపయోగపడితే కండల వీరుడికి ప్లస్ అవుతుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సికందర్ డబ్బింగ్ చేస్తారా లేదానేది ఇంకా తేల్చలేదు.
This post was last modified on March 19, 2025 10:09 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…