గత డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన సారంగపాణి జాతకం ఎట్టకేలకు రిలీజ్ డేట్ దక్కించుకుంది. ఏప్రిల్ 18 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే వచ్చిన కోర్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రియదర్శి మార్కెట్ పెరిగింది. ఇప్పుడు తర్వాతి సినిమా ఇదే కావడంతో బిజినెస్ పరంగా చాలా హెల్ప్ కానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ ఫన్ ఎంటర్ టైనర్ లో రూపా కొడువయూర్ హీరోయిన్ గా నటించింది. అతి త్వరలో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేయబోతున్నారు.
ఇక్కడ అనుష్క ఘాటీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఏప్రిల్ 18 ముందు లాక్ చేసుకున్నది ఈ ప్యాన్ ఇండియా మూవీనే. యువి క్రియేషన్స్ సంస్థ క్రిష్ దర్శకత్వంలో రూపొందించిన ఈ లేడీ గ్యాంగ్ స్టర్ డ్రామా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే రిలీజ్ ఇంకో నెల రోజులు మాత్రమే ఉన్నప్పటికి ఘాటీ ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టకపోవడం పలు అనుమానాలు లేవనెత్తింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతోందట. విఎఫెక్స్ పనులతో పాటు రీ రికార్డింగ్ కు ఎక్కువ సమయం అవసరం పడటంతో పోస్ట్ పోన్ చేశారట. వాయిదాని అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు పక్కానే.
ఇక్కడ మరో రెండు విషయాలున్నాయి. యువి టీమ్ ఒకపక్క విశ్వంభరని చూసుకుంటోంది. గ్రాఫిక్స్ టీమ్ ని మార్చడంతో ఎక్కువ ఫోకస్ దాని మీద పెట్టాల్సి వచ్చిందట. ఇంకోవైపు క్రిష్ కి హరిహర వీరమల్లు టీమ్ నుంచి పిలుపు వచ్చిందట. ప్రాజెక్టుని వదిలేసినప్పటికీ అధిక భాగం క్రిష్ డైరెక్ట్ చేసిందే కావడంతో ఎడిటింగ్, ఫైనల్ కాపీ చెకింగ్ లో ఆయన సహకారం కోరినట్టు వినికిడి. ఈ ప్రతిపాదనకు సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు కానీ టాక్ అయితే జోరుగా ఉంది. నిజమైతే క్రిష్ కు కొంత బ్రేక్ అవసరం. ఏదైతేనేం ఘాటీ వల్ల సారంగపాణికి మేలు జరిగింది. కామెడీ జానర్ కాబట్టి మరోసారి పెద్ద బ్రేకవుతుందని ప్రియదర్శి నమ్మకంతో ఉన్నాడు.
This post was last modified on March 17, 2025 6:03 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…