గత డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన సారంగపాణి జాతకం ఎట్టకేలకు రిలీజ్ డేట్ దక్కించుకుంది. ఏప్రిల్ 18 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే వచ్చిన కోర్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రియదర్శి మార్కెట్ పెరిగింది. ఇప్పుడు తర్వాతి సినిమా ఇదే కావడంతో బిజినెస్ పరంగా చాలా హెల్ప్ కానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ ఫన్ ఎంటర్ టైనర్ లో రూపా కొడువయూర్ హీరోయిన్ గా నటించింది. అతి త్వరలో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేయబోతున్నారు.
ఇక్కడ అనుష్క ఘాటీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఏప్రిల్ 18 ముందు లాక్ చేసుకున్నది ఈ ప్యాన్ ఇండియా మూవీనే. యువి క్రియేషన్స్ సంస్థ క్రిష్ దర్శకత్వంలో రూపొందించిన ఈ లేడీ గ్యాంగ్ స్టర్ డ్రామా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే రిలీజ్ ఇంకో నెల రోజులు మాత్రమే ఉన్నప్పటికి ఘాటీ ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టకపోవడం పలు అనుమానాలు లేవనెత్తింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతోందట. విఎఫెక్స్ పనులతో పాటు రీ రికార్డింగ్ కు ఎక్కువ సమయం అవసరం పడటంతో పోస్ట్ పోన్ చేశారట. వాయిదాని అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు పక్కానే.
ఇక్కడ మరో రెండు విషయాలున్నాయి. యువి టీమ్ ఒకపక్క విశ్వంభరని చూసుకుంటోంది. గ్రాఫిక్స్ టీమ్ ని మార్చడంతో ఎక్కువ ఫోకస్ దాని మీద పెట్టాల్సి వచ్చిందట. ఇంకోవైపు క్రిష్ కి హరిహర వీరమల్లు టీమ్ నుంచి పిలుపు వచ్చిందట. ప్రాజెక్టుని వదిలేసినప్పటికీ అధిక భాగం క్రిష్ డైరెక్ట్ చేసిందే కావడంతో ఎడిటింగ్, ఫైనల్ కాపీ చెకింగ్ లో ఆయన సహకారం కోరినట్టు వినికిడి. ఈ ప్రతిపాదనకు సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు కానీ టాక్ అయితే జోరుగా ఉంది. నిజమైతే క్రిష్ కు కొంత బ్రేక్ అవసరం. ఏదైతేనేం ఘాటీ వల్ల సారంగపాణికి మేలు జరిగింది. కామెడీ జానర్ కాబట్టి మరోసారి పెద్ద బ్రేకవుతుందని ప్రియదర్శి నమ్మకంతో ఉన్నాడు.
This post was last modified on March 17, 2025 6:03 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…