నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. 2023 డెవిల్ తర్వాత మళ్ళీ దర్శనమివ్వలేదు. ఈసారి అర్జున్ సన్నాఫ్ వైజయంతిగా రాబోతున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి కీలక పాత్ర పోషించడం విశేషం. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తర్వాత మళ్ళీ నటించనని చెప్పిన ఒకప్పటి ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడీ కథ నచ్చడం వల్ల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులోనూ బాబాయ్ బాలయ్యతో ఎన్నో సూపర్ హిట్స్ లో పాలు పంచుకున్నాక ఇప్పుడు అబ్బాయ్ తల్లిగా నటించడం విశేషమనే చెప్పాలి.
ఇవాళ విడుదల చేసిన టీజర్లో కథేంటో క్లుప్తంగా చెప్పారు. డ్యూటీ అంటే ప్రాణమిచ్చే పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయశాంతి) కి కొడుకు అర్జున్ విశ్వనాధ్ (కళ్యాణ్ రామ్) అంటే ప్రాణం. ఎప్పటికైనా తన వారసుడిని ఖాకీ దుస్తుల్లో చూసుకోవాలని కంటికి రెప్పలా పెంచుతుంది. అయితే తల్లి కర్తవ్యం కోసం పాటు పడినట్టే కొడుకు సమాజంలో చీడపురుగులను ఏరిపారేయడానికి నరసింహావతారం ఎత్తుతాడు. కానీ తప్పు చేస్తే బిడ్డ అయినా సరే క్షమించే మనసత్త్వం లేని వైజయంతికి అర్జున్ కు మధ్య అడ్డుగోడలు ఏర్పడతాయి. అవి ఎవరి వల్ల, చివరికి ఏం జరిగిందనేది తెరమీద చూడాలి.
యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, ఎలివేషన్ అన్నీ ఉండేలా దర్శకుడు ప్రదీప్ తీసుకున్న శ్రద్ధ టీజర్ లో కనిపించింది. స్టోరీ పరంగా మరీ నెవర్ బిఫోర్ అని కాదు కానీ పటాస్ తరహాలో మరోసారి బలమైన కంటెంట్ కళ్యాణ్ రామ్ కు పడిందన్న నమ్మకం అభిమానులకు కలిగేలా ఉంది. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్ గా నిలవగా హీరోయిన్ సయీ మంజ్రేకర్ తో పాటు శ్రీకాంత్ ఇతర ఆర్టిస్టులను ఎక్కువ రివీల్ చేయకుండా ఒకటి రెండు షాట్స్ కు పరిమితం చేశారు. త్వరలోనే విడుదల కానున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈ వేసవిలోనే థియేటర్లలో అడుగు పెట్టేందుకు ముస్తాబు అవుతోంది.
This post was last modified on March 17, 2025 12:56 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…