కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు స్టార్లు లేకపోయినా బ్రహ్మాండంగా ఆదరిస్తారని గతంలో బలగం లాంటివి ఋజువు చేస్తే తాజాగా కోర్ట్ దాన్ని మించిన విజయంతో ఏకంగా రికార్డులనే టార్గెట్ చేసుకుంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆదివారమైన మూడో రోజే ఎక్కువ వసూళ్లు నమోదయ్యాయి. సండే హాలిడేని పూర్తిగా సద్వినియోగపరుచుకుంటూ సుమారు 8 కోట్ల 40 లక్షలకు పైగా గ్రాస్ నమోదు చేయడం మాములు విషయం కాదు. మొత్తం వీకెండ్ దాకా వచ్చిన కలెక్షన్లు చూసుకుంటే కోర్ట్ బ్రేక్ ఈవెన్ దాటేయడమే కాక పాతిక కోట్ల గ్రాస్ కు అతి దగ్గరగా వెళ్ళిపోయింది. ఇది పెద్ద మైలురాయి.
ఇదింకా ప్రారంభమే కాబట్టి ఫైనల్ రన్ గురించి అప్పుడే అంచనాకు రాలేం. మార్చి 21 కొత్త రిలీజులు ఉన్నప్పటికీ అవి కోర్ట్ ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పలేం. చెప్పుకోదగ్గవి లేవు కాబట్టే సలార్ బుకింగ్సే బాగున్నాయి. సో కోర్ట్ కు ఇంకో అవకాశం దొరికినట్టే. సాలిడ్ గా ఈ రన్ కొనసాగితే మాత్రం నలభై కోట్ల వరకు లాగొచ్చని బయ్యర్ల అంచనా. ముఖ్యంగా నైజామ్ లో ఈ సినిమా దూకుడు మాములుగా లేదు. నిన్న హైదరాబాద్ లో దాదాపు తొంభై శాతం దాకా ఆక్యుపెన్సీ నమోదయ్యింది. ఏ, బి సెంటర్స్ అన్నింటిలోనూ దాదాపు ఇదే పరిస్థితి. సి కేంద్రాల్లో మాత్రం కోర్ట్ కొంచెం నెమ్మదిగా ఉంది.
న్యాచురల్ స్టార్ నాని నమ్మకం ఎట్టకేలకు నిలబడింది. మొన్న సక్సెస్ మీట్ లో టీమ్ లో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. కోర్ట్ ని ఏకంగా సినిమాటిక్ యునివర్స్ గా చేసే ఆలోచన కూడా నాని బృందంలో జరుగుతోంది. హిట్ సిరీస్ ఎలాగైతే రేంజ్ పెరుగుతూ మూడు భాగాలుగా వచ్చిందో కోర్ట్ ని కూడా అలాగే డెవలప్ చేయాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. కాకపోతే ఎంచుకునే కేసుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్ట్ రూమ్ డ్రామాలు ప్రతిసారి ఒకే ఫలితాన్ని ఇవ్వవు. డెప్త్, ఎమోషన్స్ ఇవన్నీ సరైన పాళ్ళలో కుదిరితేనే జనం ఆదరిస్తారు. నాని క్యాలికులేటెడ్ గా, పక్కాగా ఉంటాడు కాబట్టి డౌట్ అక్కర్లేదు.
This post was last modified on March 17, 2025 11:04 am
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట తాను చేసిన శంకు స్థాపన తాలూకు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో…