డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్న సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా జాక్ విడుదలకు నెల కూడా లేదు. ఇంకో ఇరవై ఏడు రోజుల్లో జాక్ థియేటర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే బజ్ పరంగా ఆశించిన స్థాయిలో లేదనే టాక్ అభిమానుల మధ్య ఉంది. సిద్ధూకి ఈ మూవీ ఒకరకంగా ఛాలెంజ్ లాంటిది. ఎందుకంటే టిల్లు బ్రాండ్ లేకుండా సోలోగా తన స్టామినా ఏంటనేది దీంతోనే ఋజువు చేసుకోవాలి. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ పెద్ద బడ్జెట్ పెట్టారు.
ఇక జాగ్రత్తలని ఎందుకు అనాల్సి వచ్చిందో చూద్దాం. జాక్ నుంచి విడుదలైన లిరికల్ సాంగ్ కి మంచి రెస్పాన్సే కనిపిస్తోంది కానీ ఆశించిన స్థాయిలో వైరల్ కాలేదు. అచ్చు రాజమణిని తీసుకోవడంలో ఉద్దేశం ఏదైనా ఆయన అంచనాలను పూర్తిగా అందుకోలేకపోతున్నాడనే కామెంట్స్ ఫాన్స్ నుంచి వస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం శ్రీచరణ్ పాకాలను తీసుకున్నారు. కానీ ఇప్పుడాయన స్థానంలో సామ్ సిఎస్ ని లాక్ చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. పుష్ప 2 ది రూల్, క తర్వాత సామ్ బిజిఎం కోసం డిమాండ్ పెరిగిపోయింది. అందుకే జాక్ కోసం తననే లాక్ చేసినట్టు తెలిసింది. ఇది మంచి పరిణామమే.
ఏప్రిల్ 10 అసలే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పోటీ ఉంది. దానికి తెలుగులో టెన్షన్ పడాల్సిన పని లేదు కానీ మైత్రి ప్రొడక్షన్ కాబట్టి డబ్బింగ్ అయినా సరే భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తారు. ప్రీ టాక్ పాజిటివ్ గా ఉంది కనక మరీ తక్కువంచనా వేయడానికి లేదు. అదే నిజమైన పక్షంలో జాక్ కి మంచి కాంపిటీషన్ ఉన్నట్టే. అదే రోజు సన్నీ డియోల్ జాత్ వస్తోంది. దీన్ని కూడా తెలుగులో అనువదించి మైత్రినే రిలీజ్ చేస్తోంది. సో పబ్లిసిటీ పరంగా జాక్ నెక్స్ట్ లెవెల్ పబ్లిసిటీ చేస్తేనే ప్రచారపరంగా దూసుకెళ్తుంది. మార్చి మూడో వారం నుంచి సిద్దు జొన్నలగడ్డ స్వయంగా రంగంలోకి దిగబోతున్నాడు. చూద్దాం.
This post was last modified on March 13, 2025 2:04 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…