నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో ఇండస్ట్రీకి వచ్చిన రోషన్ డెబ్యూ చేశాక నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. 2021 తర్వాత కుర్రాడు తెరమీద కనిపించలేదు. పెద్ద బ్యానర్లు, బడా ఆఫర్లు వచ్చినా ఎందుకో కథల ఎంపికలో జాప్యం చేసుకుంటూ చివరికి ఈ సంవత్సరం రెండు సార్లు దర్శనమివ్వబోతున్నాడు. వాటిలో మొదటిది ఛాంపియన్. ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా బ్యానర్ పై ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ కం యాక్షన్ డ్రామాలో రోషన్ ఫుట్ బల్ ప్లేయర్ గా ఇంటెన్స్ లుక్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. ఇవాళ తన బర్త్ డే సందర్భంగా చిన్న టీజర్ వదిలారు.
నలభై సెకండ్ల వీడియోలో కథను రివీల్ చేయలేదు కానీ రోషన్ మేకని పరిచయం చేసిన తీరు అంచనాలు రేపేలా ఉంది. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చిన ఛాంపియన్ కు టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. క్యాస్టింగ్ తదితర వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. దీన్ని 2023 లో ప్రకటించారు. కానీ అనివార్య కారణాల వల్ల సకాలంలో పూర్తి కాలేదు. అశ్వినీదత్ లాంటి అగ్ర నిర్మాత బ్యానరే అయినా ఇంత డిలే కావడం అంతు చిక్కనిది. ఎందుకు జరిగిందో తర్వాత బయటికి వస్తుంది కానీ ఛాంపియన్ ని 2025 లోనే విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే డేట్ ఇంకా ఖరారు కాలేదు.
ఇది కాకుండా మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభలో రోషన్ నటించాడు. చాలా ప్రాధాన్యం ఉన్నందు వల్లే మలయాళం అయినా సరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీని షూట్ దాదాపుగా పూర్తయ్యింది. ఇదంతా బాగానే ఉంది కానీ పోటీ ప్రపంచంలో రోషన్ మేక లాంటి కుర్రాళ్ళు పరుగులు పెట్టాలి. హిట్టో ఫ్లాపో వరసగా సినిమాలు చేయాలి. కెరీర్ ప్రారంభంలోనే ఇంత గ్యాప్ తీసుకోవడం సేఫ్ కాదు. మన మీద విపరీతమైన అంచనాలు లేనప్పుడే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. దాన్ని వాడుకుంటూ అన్ని జానర్స్ ట్రై చేయాలి. రోషన్ తో పాటే పరిచయమైన శ్రీలీల అతి తక్కువ టైంలో ఎంత దూసుకెళ్ళిందో వేరే చెప్పాలా.
This post was last modified on March 13, 2025 12:24 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…