జనవరిలో మూడు వందల కోట్ల వసూళ్లతో సునామిలా విరుచుకుపడి ఇండస్ట్రీ హిట్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సంచలనాలు ఇక్కడితో ఆగిపోవడం లేదు. యాభై రోజులు దాటిన తర్వాత కూడా ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉండటం చూసి వెంకటేష్ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఇటీవలే ఈ బ్లాక్ బస్టర్ జీ ఛానల్ లో శాటిలైట్ ప్రీమియర్ జరుపుకున్న సంగత్ తెలిసిందే. తాజాగా వచ్చిన టిఆర్పి రేటింగ్స్ లో సంక్రాంతికి వస్తున్నాం ఏకంగా 15.92 సాధించి ఔరా అనిపించేసింది. హెచ్డి ఛానల్ కు విడిగా వచ్చిన 2.3 కలుపుకుని సగటు తీసుకుంటే ఇది పద్దెనిమిది దాటిపోతుంది.
ఇక్కడ అసలు విశేషం ఏంటంటే చాలా ఏళ్లుగా ఇంత టిఆర్పి సాధించిన సినిమాలు ఏవి లేవు. ఆర్ఆర్ఆర్, కల్కి, హనుమాన్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ సైతం ఇంత రాబట్టుకోలేదు. కారణం స్పష్టం. వెంకీ హై వోల్టేజ్ ఎంటర్ టైనర్ ని జనం బుల్లితెరపై మరోసారి చూసేందుకు ఎగబడటమే. సమాంతరంగా ఓటిటిలో స్ట్రీమింగ్ చేసినా సరే ఇంత నెంబర్ నమోదు కావడం రికార్డు. ఇదే జీ ఛానల్ గతంలో వచ్చిన శ్రీమంతుడు, వకీల్ సాబ్, డీజే, గీత గోవిందం లాంటివి టాప్ ప్లేస్ లో ఉండగా అప్పటి పరిస్థితులకు ఇప్పటికి చాలా మార్పులు వచ్చిన నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం ఫీట్ చాలా స్పెషల్.
ఇదే తరహాలో ఓటిటిలోనూ వందల మిలియన్ల వ్యూస్ అలవోకగా సాధించిన సంక్రాంతికి వస్తున్నాం ఇకనైనా చల్లారుతుందో లేదో చూడాలి. ఈటీవీ, జెమిని, స్టార్ మాతో పోలిస్తే కొంచెం వెనుకబడినట్టు అనిపించే జీ తెలుగులో ఒక కొత్త సినిమా ఇంతగా రేటింగ్ తెచ్చుకోవడం టీవీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి దిల్ రాజు ఈ సినిమా ఓటిటి డీల్స్ సమయంలో సరైన రేట్ రాక కొంచెం ఇబ్బంది పడ్డారు. బడా కంపెనీలు తటపటాయించాయి. తర్వాత జీ5 ప్రవేశించింది. తీరా చూస్తే పోటీలో ఉన్న ఇతర పండగ చిత్రాలను పక్కకు తోసేసి మరీ మూడు చోట్ల (థియేటర్ – శాటిలైట్ – ఓటిటి) విజేతగా నిలిచింది.
This post was last modified on March 13, 2025 12:10 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…