మెగాస్టార్ చిరంజీవి మెగా ఫాంటసీ మూవీ విశ్వంభర విడుదల చిరు పుట్టినరోజు ఆగస్ట్ 22కి ఉండొచ్చన్న వార్త మెల్లగా పాకుతోంది. యూనిట్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రానప్పటికీ వేసవిలో హరిహర వీరమల్లు ఉంది కాబట్టి మరో మెగా ప్యాన్ ఇండియా మూవీ ఎందుకనే ఉద్దేశంతో పాటు హీరో బర్త్ డే అయితే మంచి సందర్భం అవుతుందనే అభిప్రాయం కొందరు ఫ్యాన్స్ వ్యక్తం చేయడంతో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే ఆలోచనలో యువి క్రియేషన్స్ ఉందని లేటెస్ట్ అప్డేట్. అయితే అంత రిస్క్ నిజంగా తీసుకుంటారా అంటే డౌటే. ఎందుకంటే దానికి పలు కారణాలున్నాయి.
ఆగస్ట్ 14 జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ వార్ 2 ఉంది. ఖచ్చితంగా డేట్ మిస్ చేయకూడదనే లక్ష్యంతో యష్ రాజ్ ఫిలింస్ పక్కా ప్లానింగ్ తో ముందెకెళ్తోంది. హృతిక్ గాయం వల్ల బ్రేక్ పడినా సరే ఎలాంటి ఇబ్బంది లేదంటోంది. ఇంకోవైపు రజనీకాంత్ కూలికి కూడా అదే తేదీని చూస్తున్నారు. ఒకవేళ వార్ 2 ఫిక్స్ అయితే వారం రెండు వారాలు ఆలస్యంగా అయినా కూలిని బరిలో దిగుతుందని చెన్నై వర్గాల కథనం. ఇది మాములు మల్టీస్టారర్ కాదు. రజనితో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్రల కాంబో వినగానే హైప్ పెంచుతోంది. తెలుగు వెర్షన్ కే నలభై కోట్ల దాకా రేట్ పలుకుతోందని ఇండస్ట్రీ టాక్.
వీటికి తోడు ఆగస్ట్ 15 ది ఢిల్లీ ఫైల్స్ ని తీసుకొస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా భారీ ఎత్తున రిలీజ్ ఉంటుంది. వీటి మధ్య విశ్వంభర రిస్క్ చేయడం కంటే సోలో డేట్ చూసుకోవడం బెటర్. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టు మే 9 బెస్ట్ అయ్యేది. గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోకసుందరి సెంటిమెంట్ కూడా కలిసివచ్చేది. కానీ ఇప్పుడా స్థానంలో వీరమల్లు రావొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మెగా బ్రదర్స్ లో ఎవరొస్తారనేది పెద్ద సస్పెన్స్. షూటింగ్ చివరి దశలో ఉండగా ఇంకో పాట షూట్ బాలన్స్ ఉందట. టీజర్ రెస్పాన్స్ చూశాక విఎఫెక్స్ మీద పెడుతున్న ఫోకస్ వల్ల ఆలస్యం పెరుగుతోంది.
This post was last modified on March 11, 2025 8:07 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…