Movie News

‘పుష్ప’ బాటలో అఖిల్ సినిమా

రాయలసీమ నేపథ్యంలో సినిమాలు అనగానే ఎప్పుడూ కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల భాష, యాస, కల్చర్‌‌ బ్యాక్ డ్రాప్‌గా తీసుకునేవాళ్లు ఒకప్పటి దర్శకులు. ఫ్యాక్షన్ సినిమాలు అనగానే ఆ మూడు జిల్లాలో ఏదో ఒక దాన్ని నేపథ్యంగా ఎంచుకునేవారు. సీమలో భాగం అయిన చిత్తూరు జిల్లా మీద ఫోకస్ ఉండేది కాదు. కానీ ఈ మధ్య చిత్తూరు నేపథ్యంలో సినిమాలు పెరుగుతున్నాయి. అందుకు ముఖ్య కారణం.. ‘పుష్ప’ అని చెప్పొచ్చు.

ఈ సినిమా పూర్తిగా చిత్తూరు నేపథ్యంలోనే సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంతో పాటు ‘పుష్ప-2’ సైతం బ్లాక్ బస్టర్ కావడంతో చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌కు క్రేజ్ ఇంకా పెరిగింది. గత కొన్నేళ్లలో వినరో భాగ్యము విష్ణు కథ, హరోం హర, 35.. ఇలా చాలా సినిమాలే చిత్తూరు జిల్లా నేపథ్యంలో తెరకెక్కాయి. ఇప్పుడు ఇంకో క్రేజీ మూవీకి ఈ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నట్లు సమాచారం.

అక్కినేని అఖిల్ కొత్త చిత్రం చిత్తూరు నేపథ్యంలోనే సాగుతుందట. ఇక్కడ భాష, యాస, కల్చర్‌ను ఈ చిత్రంలో బాగా చూపించబోతున్నారట. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్ర దర్శకుడు మురళీ కృష్ణనే అఖిల్ కొత్త సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. మరోసారి అతను చిత్తూరు జిల్లా నేపథ్యంలో కథ సిద్ధం చేశాడు. అతడి కథ నచ్చి స్వయంగా అఖిల్ తండ్రి నాగార్జునే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సుదీర్ఘ కసరత్తు తర్వాత ఎట్టకేలకు ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఈ నెల 14న ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందట. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఏజెంట్’ డిజాస్టర్ కావడంతో అఖిల్ ఈసారి చాలా గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత అతడి కొత్త చిత్రం సెట్స్ మీదికి వెళ్తోంది. దీని కంటే ముందు యువి క్రియేషన్స్‌లో ఒక సినిమా అనుకున్నారు కానీ.. ఏవో కారణాలతో అది ముందుకు కదల్లేదు.

This post was last modified on March 11, 2025 7:46 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

12 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

47 minutes ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

2 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

6 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

6 hours ago