ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాలీవుడ్ చిత్రాల రేంజే వేరుగా ఉండేది. వాటి బడ్జెట్లు, బిజినెస్, వసూళ్లు అన్నీ కూడా మిగతా ఇండస్ట్రీల చిత్రాలు అందుకోలేని స్థాయిలో ఉండేవి. సౌత్ సినిమాలను నార్త్ వాళ్లు చాలా తక్కువగా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్నాయి. బాలీవుడ్ చిత్రాలేమో తేలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వేడుకలో లెజెండరీ రైటర్ జావెద్ అక్తర్.. ఆమిర్ ఖాన్కు ఒక ఆసక్తికర ప్రశ్న వేశారు. ముక్కూ మొహం తెలియని దక్షిణాది హీరోల సినిమాలు ఉత్తరాదిన వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నాయని.. అదే సమయంలో బాలీవుడ్ చిత్రాలు వెనుకబడుతున్నాయని.. దీనికి కారణం ఏంటని ఆమిర్ను జావెద్ ప్రశ్నించారు. దీనికి ఆమిర్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఏ సినిమా ఎక్కడిది అనేది పెద్ద విషయం కాదని ఆమిర్ అన్నాడు. దక్షిణాది, ఉత్తరాది అనే తేడాలు అనవసరమని ఆమిర్ అభిప్రాయపడ్డాడు. ఓటీటీలే బాలీవుడ్ వెనుకబడడానికి ప్రధాన కారణం అన్నట్లుగా ఆమిర్ మాట్లాడాడు. ‘‘దయచేసి థియేటర్కు వచ్చి మా సినిమా చూడండి అని అభ్యర్థిస్తాం. ఒకవేళ ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతే 8 వారాల తర్వాత మనమే తీసుకెళ్లి ఇంట్లో ఆ సినిమా చూపిస్తాం. ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రేక్షకులు కొన్ని వారాల తర్వాత ఎంచక్కా టీవీలో సినిమా చూస్తున్నారు. ఒకే ఉత్పత్తిని రెండుసార్లు ఎలా విక్రయించాలో నాకు తెలియదు.
ఓటీటీలు లేనపుడు ప్రేక్షకులు థియేటర్లకే వచ్చి సినిమా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంతో నచ్చితే తప్ప థియేటర్లకు రావట్లేదు. మనం ఎక్కడి నుంచైనా సినిమా చూడొచ్చు అనే ఆప్షన్ ఉంది. ఈ బిజినెస్ మోడల్తో మన సినిమాలను మనమే చంపుకుంటున్నాం. హిందీ చిత్రాల దర్వకులు మరింత ఎక్కువ మెరుగులు దిద్దాలనే ఉద్దేశంతో మూలాలను మరిచిపోతున్నట్లు అనిపిస్తోంది. ఎమోషన్లను మిళితం చేయలేకపోతున్నాం. జీవితంలోని వివిధ కోణాలను మనం స్పృశించాలి’’ అని ఆమిర్ పేర్కొన్నాడు.
This post was last modified on March 11, 2025 7:27 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…