ప్రపంచ చరిత్రలో అత్యుత్తమ సినిమాల గురించి జాబితా రాస్తే టాప్ 10లో ఖచ్చితంగా ఉండే పేరు అవతార్. 2009 లో రిలీజైన ఈ అద్భుత సృష్టి మన దేశంలోనూ భారీ వసూళ్లతో విరుచుకుపడింది. దీని క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అబ్బుర పరిచే విజువల్ ఎఫెక్ట్స్ తో ఎప్పుడూ చూడని ఆకుపచ్చ ప్రపంచంలోకి దర్శకుడు జేమ్స్ క్యామరూన్ తీసుకెళ్లిన తీరు ఎందరో ఫిలిం మేకర్స్ కి ఒక డిక్షనరీ లాంటిది. అలాంటి అవతార్ టైటిల్ ఒక బాలీవుడ్ సీనియర్ హీరో చెప్పాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ గోవిందా ఈ ముచ్చట స్వయంగా పంచుకున్నారు. ముందు ఏమన్నారో చూద్దాం.
“అమెరికాలో ఒక సర్దార్ ని కలిసినప్పుడు ఒక వ్యాపారానికి సంబంధించిన ఐడియా చెప్పా. అది బ్రహ్మాండంగా పనికొచ్చింది. ఆ కృతజ్ఞతతో కొన్ని సంవత్సరాల తర్వాత నాకు జేమ్స్ క్యామరూన్ తో సమావేశం ఏర్పాటు చేశాడు. నేను డిన్నర్ కి పిలిచా. మాటల మధ్యలో అవతార్ పేరు పెట్టుకోమని సూచించా. హీరో వికలాంగుడు కాబట్టి నేను చేయనని చెప్పా. ఒకవేళ ఓకే చెబితే 18 కోట్లు ఇస్తానని అన్నాడు. అంతే కాదు 410 రోజులు కాల్ షీట్స్ ఇవ్వాలని చెప్పాడు. శరీరం మొత్తం పెయింట్ వేసుకోవడం ఇష్టం లేక క్యామరూన్ ఆఫర్ తిరస్కరించా. దేవుడిచ్చిన ఒకే దేహం మీద తొందరపడి ప్రయోగాలు చేయకూడదు”.
చూశారుగా. శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా నిర్వహించిన వీడియో పాడ్ కాస్ట్ లో గోవిందా ఇదంతా చెప్పుకొచ్చారు. వినడానికి బాగానే ఉంది కానీ నమ్మశక్యంగా లేదు. అవతార్ ఇంగ్లీష్ పదం కాదనేది నిజమే అయినా మరీ పెద్దాయన చెబితే పెట్టుకున్నారంటేనే అతిశయోక్తిగా అనిపిస్తుంది. పైగా నటించమని కూడా అడిగారట. ఇక్కడే అసలు డౌట్ కొట్టేది. దీని సంగతి పక్కనపెడితే ముప్పై ఏళ్ళ క్రితం ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో హీరోగా నటించిన గోవిందా సినిమాలు తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. ఆంఖే (పోకిరి రాజా), కూలి నెం 1 (చిన్న అల్లుడు), ఖుద్దార్ (ఎస్పి పరశురామ్) లాంటివి అగ్ర హీరోలు చేయడం పలుమార్లు జరిగింది.
This post was last modified on March 10, 2025 5:13 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…