ప్రస్తుతం ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న కథానాయికల్లో కియారా అద్వానీ ఒకరు. హిందీతో పాటు తెలుగులోనూ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ ఆమె మంచి పాపులారిటీనే సంపాదించుకుంది. చివరగా రామ్ చరణ్తో ఆమె నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ సంక్రాంతికి రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. కియారా మాత్రం తన అందచందాలతో బాగానే మెప్పించింది. జూనియర్ ఎన్టీఆర్ ఒక హీరోగా నటిస్తున్న ‘వార్-2’తో పాటు ‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త చిత్రం ‘టాక్సిక్’లోనూ ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
వీటితో పాటు ‘డాన్-3’ లాంటి మరో క్రేజీ మూవీ కూడా కియారా కమిటైంది. షారుఖ్ ఖాన్ నటించిన ‘డాన్’, ‘డాన్-2’ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న చిత్రంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించబోతున్నాడు. ఐతే ఈ ప్రాజెక్టు నుంచి కియారా తప్పుకుందన్నది తాజా సమాచారం. రెండేళ్ల కిందట తన ‘షేర్షా’ కోస్టార్ సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న కియారా.. ఇప్పుడు గర్భవతి అయినట్లు సోషల్ మీడియా పోస్ట్ తో కన్ఫర్మ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఆమె విశ్రాంతికి పరిమితం కానుంది.
‘డాన్-2’ ఈ ఏడాది ద్వితీయార్దంలో సెట్స్ మీదికి వెళ్లనుంది. అప్పటికి కియారా నిండు గర్భిణిగా ఉంటుంది. అందుకే ఆ సినిమా నుంచి పరస్పర అంగీకారంతో ఆమె బయటికి వచ్చేసింది. ప్రెగ్నెంట్ కావడంతో ఇంకో రెండు మూడేళ్ల పాటు కియారా సినిమాల్లో నటించే అవకాశం లేదు. ‘డాన్-3’ అనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ ‘డాన్’కు రీమేక్గా 2006లో వచ్చిన ‘డాన్’ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత దాని సీక్వెల్ ‘డాన్-2’ 2011లో రిలీజైంది. కానీ అది సరిగా ఆడలేదు. ఇప్పుడు వీటి దర్శకుడు ఫర్హాన్ అక్తర్.. రణ్వీర్తో ‘డాన్-3’ ప్లాన్ చేశాడు. మరి కియారా తప్పుకున్న నేపథ్యంలో ఆమె స్థానంలోకి వచ్చే హీరోయినెవరో చూడాలి.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…