ప్రస్తుతం ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న కథానాయికల్లో కియారా అద్వానీ ఒకరు. హిందీతో పాటు తెలుగులోనూ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ ఆమె మంచి పాపులారిటీనే సంపాదించుకుంది. చివరగా రామ్ చరణ్తో ఆమె నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ సంక్రాంతికి రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. కియారా మాత్రం తన అందచందాలతో బాగానే మెప్పించింది. జూనియర్ ఎన్టీఆర్ ఒక హీరోగా నటిస్తున్న ‘వార్-2’తో పాటు ‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త చిత్రం ‘టాక్సిక్’లోనూ ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
వీటితో పాటు ‘డాన్-3’ లాంటి మరో క్రేజీ మూవీ కూడా కియారా కమిటైంది. షారుఖ్ ఖాన్ నటించిన ‘డాన్’, ‘డాన్-2’ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న చిత్రంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించబోతున్నాడు. ఐతే ఈ ప్రాజెక్టు నుంచి కియారా తప్పుకుందన్నది తాజా సమాచారం. రెండేళ్ల కిందట తన ‘షేర్షా’ కోస్టార్ సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న కియారా.. ఇప్పుడు గర్భవతి అయినట్లు సోషల్ మీడియా పోస్ట్ తో కన్ఫర్మ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఆమె విశ్రాంతికి పరిమితం కానుంది.
‘డాన్-2’ ఈ ఏడాది ద్వితీయార్దంలో సెట్స్ మీదికి వెళ్లనుంది. అప్పటికి కియారా నిండు గర్భిణిగా ఉంటుంది. అందుకే ఆ సినిమా నుంచి పరస్పర అంగీకారంతో ఆమె బయటికి వచ్చేసింది. ప్రెగ్నెంట్ కావడంతో ఇంకో రెండు మూడేళ్ల పాటు కియారా సినిమాల్లో నటించే అవకాశం లేదు. ‘డాన్-3’ అనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ ‘డాన్’కు రీమేక్గా 2006లో వచ్చిన ‘డాన్’ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత దాని సీక్వెల్ ‘డాన్-2’ 2011లో రిలీజైంది. కానీ అది సరిగా ఆడలేదు. ఇప్పుడు వీటి దర్శకుడు ఫర్హాన్ అక్తర్.. రణ్వీర్తో ‘డాన్-3’ ప్లాన్ చేశాడు. మరి కియారా తప్పుకున్న నేపథ్యంలో ఆమె స్థానంలోకి వచ్చే హీరోయినెవరో చూడాలి.
This post was last modified on March 6, 2025 6:02 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…