ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా, హీరో ఎవరైనా తాను సినిమా ఒప్పుకుంటే ఓపెనింగ్, ప్రమోషన్లకు నయనతార ససేమిరా నో చెబుతుందనే విషయం అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే ఇవాళ జరిగిన మూకుతి అమ్మన్ 2 (అమ్మోరు తల్లి) ప్రారంభోత్సవానికి విచ్చేయడం అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం ఈ పూజా కోసమే నిర్మాత కోటి రూపాయలు ఖర్చు పెట్టి సెట్ వేశాడంటే ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. మీనా, రెజీనా తదితరులు గెస్టులుగా హాజరు కాగా కోలీవుడ్ లో వందకు పైగా ప్రముఖులకు ఖరీదైన ఇన్విటేషన్లు వెళ్లాయి. వాళ్ళెవరూ రాలేదు కానీ పిలుపుల వీడియోలు వైరలయ్యాయి.
అమ్మోరు తల్లి మొదటి భాగం హాట్ స్టార్ ద్వారా డైరెక్ట్ ఓటిటిలో రిలీజయ్యింది. ఆర్జె బాలాజీ దర్శకత్వం వహించగా భారీ స్పందన దక్కించుకుని డిజిటల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే దీని సీక్వెల్ రూపొందించే విషయంలో నిర్మాతతో అభిప్రాయభేదాలు రావడంతో బాలాజీ తప్పుకుని సూర్య హీరోగా వేరే సినిమాకు వెళ్ళిపోయాడు. ఈయన స్థానంలో అరణ్మయి డైరెక్టర్ సుందర్ సి ముప్పై రోజుల్లో స్క్రిప్ట్ సిద్ధం చేసి వంద కోట్ల బడ్జెట్ అడిగేశాడు. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నిర్మాత గణేష్ దానికి ఎస్ అనేశారు. ప్యాన్ ఇండియా భాషల్లో భారీ ఎత్తున ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తానని ప్రకటించారు.
ఇంత పెద్ద స్కేల్ కాబట్టే నయనతారకు రావడం మినహా మరో ఆప్షన్ లేకుండా పోయింది. టైటిల్ రోల్ తనదే. పైగా ఆమె లేకుండా ఓపెనింగ్ చేస్తే కామెడీ అయిపోతుంది. దీనికి తోడు ప్రొడ్యూసర్ పెట్టిన కళ్లుచెదిరే ఖర్చు. దెబ్బకు రాజీపడక తప్పలేదు. ఇటీవలే లేడీ సూపర్ స్టార్ బిరుదు వాడొద్దని నయన్ సోషల్ మీడియాలో లెటర్ పెట్టిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ధనుష్ తో వివాదం వల్ల నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కేసులో పోరాడుతున్న నయనతార ఈ మధ్య బయట బాగానే దర్శనమిస్తోంది. ఇదంతా ఓకే కానీ దెయ్యాల సినిమా స్పెషలిస్టుగా పేరు పొందిన సుందర్ సి ఈ దేవత కథని ఎలా తెరకెక్కిస్తాడో.
This post was last modified on March 6, 2025 2:12 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…