మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ కొనసాగింపుగా వస్తున్న ఎల్2 ఎంపురాన్ ఈ నెల 27 విడుదలకు రెడీ అవుతోంది. కేరళలో భారీ బిజినెస్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాకు ఇతర భాషల్లో పోటీ వల్ల చిక్కులు తప్పడం లేదు. ముఖ్యంగా తెలుగు సంగతి చూస్తే మార్చి 28 నితిన్ రాబిన్ హుడ్, సితార మ్యాడ్ స్క్వేర్ ఒకే రోజు వస్తున్నాయి. బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వల్ల రెండింటికి సరిపడా థియేటర్లకు ఇప్పటి నుంచే అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇంకోవైపు ఓ రెండు రోజులు అటుఇటు సల్మాన్ ఖాన్ సికందర్ వస్తుంది. దానికి మల్టీప్లెక్సుల కేటాయింపులు ఎక్కువగా ఉంటాయి.
ఇవి చాలవన్నట్టు విక్రమ్ వీరధీర శూరన్ పార్ట్ 2 అదే మార్చి ఇరవై ఏడున దిగుతోంది. మోహన్ లాల్ తో పోల్చుకుంటే టాలీవుడ్ లో విక్రమ్ కే మార్కెట్ ఎక్కువ. సో ప్రాధమిక మద్దతు చియాన్ కే ఉంటుంది. అయితే ఎల్2 ఎంపురాన్ దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ తెలుగు ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్ ని తేలిగ్గా తీసుకోవడం లేదట. సలార్, ఎస్ఎస్ఎంబి 29 నటుడిగా తనకు పెరిగిన పాపులారిటీని వాడుకుంటూనే వీలైనంత పబ్లిసిటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మైత్రి లేదా ఆసియన్ సురేష్ ఎవరో ఒకరు పంపిణి పరంగా సపోర్ట్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని సమాచారం.
ఇవన్నీ ఎలా ఉన్నా ఎల్2కి మన దగ్గర పెద్దగా బజ్ లేదు. ఎందుకంటే లూసిఫర్ డబ్బింగ్ వెర్షన్ తొలినాళ్లలో ఏపీ, తెలంగాణలో పెద్దగా ఆడలేదు. దాన్నే చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తే యావరేజ్ అయ్యింది. సో ఎల్2 కోసం ఎదురు చూస్తున్న జనాల సంఖ్య తక్కువే. కాకపోతే ట్రైలర్ ని సరిగ్గా కట్ చేసి కనెక్ట్ చేయగలిగితే మాత్రం అంచనాలు పెంచొచ్చు. కానీ రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, వీరధీర శూరన్ చాప్టర్ 2 కాంపిటీషన్ తట్టుకోవడం అంత సులభంగా ఉండదు. మోహన్ లాల్ గత సినిమా బరోజ్ దారుణంగా డిజాస్టర్ కావడం ఇప్పటి బిజినెస్ మీద కొంత ప్రభావం చూపిస్తున్న అంశాన్ని కొట్టిపారేయలేం.
This post was last modified on March 6, 2025 10:52 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…