ఇంకా ప్రకటనే రాలేదు. షూటింగ్ మొదలుకాలేదు. కానీ రవితేజ 76 వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం మాస్ జాతరని పూర్తి చేసే పనిలో ఉన్న మాస్ మహారాజా ఇటీవలే తిరుమల కిషోర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది లేటెస్ట్ అప్డేట్. స్టోరీ దాదాపుగా లాకైపోయిందని, ఫైనల్ వెర్షన్ విని ఒక అంగీకారానికి వచ్చాక అగ్రిమెంట్లు ఉంటాయని సమాచారం. అయితే 2026 పండక్కు రిలీజ్ ఉంటుందని ప్రచారంలోకి తేవడం విచిత్రం. అదేదో సామెతలా ఇంకా పెళ్లి కాకుండానే సంతానానికి నామకరణ ముహూర్తం చూసినట్టు ఇంత తొందరపాటు ఎందుకనేది అసలు ప్రశ్న.
గత ఏడాది అచ్చం ఇదే తరహాలో ఈగల్ ని సంక్రాంతికి వదలాలని తెగ ప్రయత్నించారు. అప్పటికే బరిలో మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ తో పాటు హనుమాన్ ఉండటంతో అనవసరంగా ఓపెనింగ్స్ ని దెబ్బ తీసుకోవడం ఇష్టం లేని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు. దీని వల్ల సినిమా హిట్ కాలేదు కానీ పోటీ తగ్గించుకుని సోలోగా రావడం వల్ల కాస్త మెరుగైన రెవిన్యూ దక్కింది. మళ్ళీ ఇప్పుడు అదే వరస రిపీట్ చేస్తారేమో. ఎందుకంటే 2026 సంక్రాంతికి జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో రావడం దాదాపు పక్కానే. చిరంజీవి – అనిల్ రావిపూడిది ఆలస్యం లేకుండా వచ్చేస్తుంది.
ఇవి కాకుండా ఇంకా ఎవరెవరు వస్తారో ఇప్పుడే చెప్పలేం. మాములుగా ఈ సీజన్ కి మాస్ మసాలా సినిమాలు లేదా విజువల్ ఫాంటసీలు వర్కౌట్ అవుతాయి. తిరుమల కిషోర్ కథలు సున్నితంగా ఉంటాయి. ఎంత రవితేజతో తీసేదైనా ఊర మాస్ స్టైల్ లో వెళ్ళలేడు. గతంలో రామ్ రెడ్ తో కొంచెం ట్రై చేశాడు కానీతమిళ రీమేక్ ఫ్లేవర్ వల్ల అది ఆశించిన పెద్ద స్థాయిలో విజయం సాధించలేదు. సో రవితేజతో చేయబోయే జానర్ ఎలాంటిదనేది చెక్ చేసుకోవాలి. అంతే తప్ప ఊరికే రిలీజ్ డేట్ గురించి ఊరించి తర్వాత వాయిదా వేస్తే అభిమానులకు నిరాశ తప్ప ఇంకేం మిగలదు. సో ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి మరి.
This post was last modified on March 4, 2025 5:02 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…