ఇంకా ప్రకటనే రాలేదు. షూటింగ్ మొదలుకాలేదు. కానీ రవితేజ 76 వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం మాస్ జాతరని పూర్తి చేసే పనిలో ఉన్న మాస్ మహారాజా ఇటీవలే తిరుమల కిషోర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది లేటెస్ట్ అప్డేట్. స్టోరీ దాదాపుగా లాకైపోయిందని, ఫైనల్ వెర్షన్ విని ఒక అంగీకారానికి వచ్చాక అగ్రిమెంట్లు ఉంటాయని సమాచారం. అయితే 2026 పండక్కు రిలీజ్ ఉంటుందని ప్రచారంలోకి తేవడం విచిత్రం. అదేదో సామెతలా ఇంకా పెళ్లి కాకుండానే సంతానానికి నామకరణ ముహూర్తం చూసినట్టు ఇంత తొందరపాటు ఎందుకనేది అసలు ప్రశ్న.
గత ఏడాది అచ్చం ఇదే తరహాలో ఈగల్ ని సంక్రాంతికి వదలాలని తెగ ప్రయత్నించారు. అప్పటికే బరిలో మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ తో పాటు హనుమాన్ ఉండటంతో అనవసరంగా ఓపెనింగ్స్ ని దెబ్బ తీసుకోవడం ఇష్టం లేని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు. దీని వల్ల సినిమా హిట్ కాలేదు కానీ పోటీ తగ్గించుకుని సోలోగా రావడం వల్ల కాస్త మెరుగైన రెవిన్యూ దక్కింది. మళ్ళీ ఇప్పుడు అదే వరస రిపీట్ చేస్తారేమో. ఎందుకంటే 2026 సంక్రాంతికి జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో రావడం దాదాపు పక్కానే. చిరంజీవి – అనిల్ రావిపూడిది ఆలస్యం లేకుండా వచ్చేస్తుంది.
ఇవి కాకుండా ఇంకా ఎవరెవరు వస్తారో ఇప్పుడే చెప్పలేం. మాములుగా ఈ సీజన్ కి మాస్ మసాలా సినిమాలు లేదా విజువల్ ఫాంటసీలు వర్కౌట్ అవుతాయి. తిరుమల కిషోర్ కథలు సున్నితంగా ఉంటాయి. ఎంత రవితేజతో తీసేదైనా ఊర మాస్ స్టైల్ లో వెళ్ళలేడు. గతంలో రామ్ రెడ్ తో కొంచెం ట్రై చేశాడు కానీతమిళ రీమేక్ ఫ్లేవర్ వల్ల అది ఆశించిన పెద్ద స్థాయిలో విజయం సాధించలేదు. సో రవితేజతో చేయబోయే జానర్ ఎలాంటిదనేది చెక్ చేసుకోవాలి. అంతే తప్ప ఊరికే రిలీజ్ డేట్ గురించి ఊరించి తర్వాత వాయిదా వేస్తే అభిమానులకు నిరాశ తప్ప ఇంకేం మిగలదు. సో ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి మరి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…