Movie News

దేశ ద్రోహులు, స్మగ్లర్లు హీరోలా?: వెంకయ్యనాయుడు

భారతీయ చలన చిత్రాల్లో హీరోల పాత్రల తీరుపై బీజేపీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే మృతి చెందిన తెలుగు అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడిన వెంకయ్య… ప్రస్తుతం వస్తున్న సినిమాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరోల పాత్రల తీరుపై దర్శకులు తమ పద్ధతి మార్చుకోవాలని కూడా వెంకయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గతంలో సినిమాల ద్వారా ప్రజలకు మంచి సందేశం వెళ్లేదని వెంకయ్య అన్నారు. ఇప్పుడు సినిమాల్లో దేశ ద్రోహులు, స్మగ్లర్లు, సమాజంలో తప్పుడు విధానాలు పాటించే వారితో హీరో పాత్రలకు రూపకల్పన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరహా చర్యల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం వెళుతుందన్న విషయంపై దర్శకులు ఓసారి ఆలోచన చేయాలని ఆయన అన్నారు. చెడు పనులను ఎప్పుడూ గొప్పగా చూపించకూదని కూడా వెంకయ్య అభిప్రాయపడ్డారు.

సినిమా రంగం ఎప్పుడూ బాధ్యతాయుతమైన మాధ్యమంగా ఉండాలని వెంకయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. చెడు పాత్రల ద్వారా సమాజంలో చెడు భావనలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హీరోల పాత్రల ప్రభావం చిన్న పిల్లలపై అధికంగా పడుతుందని, సున్నితమైన ఈ విషయాలపై సినీ పరిశ్రమలో ఓ విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని కూడా వెంకయ్య అబిప్రాపడ్డారు. ఇదిలా ఉంటే… ఇటీవలే నంద్యాలలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన బీజేపీ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

This post was last modified on March 3, 2025 12:42 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

26 minutes ago

త్రివిక్రమ్ స్టయిల్లో వెంకీ అట్లూరి

సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్‌గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…

2 hours ago

చిరు సినిమా… చేతులు మారుతుందా?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్‌కు…

3 hours ago

ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ…

3 hours ago

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

6 hours ago

ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…

6 hours ago