హీరోయిన్ కియారా అద్వానీ గర్భం దాల్చిన సంగతి నిన్న అధికారికంగా ఒక చిన్న ఫోటో ద్వారా బయట పెట్టడం చూశాం. ఇలాంటివి ఇంత కన్నా నేరుగా చెప్పలేరు కాబట్టి ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సిద్దార్థ్ మల్హోత్రాతో మూడు ముళ్ళు వేయించుకున్నాక మొదటిసారి తల్లి కాబోతున్న కియారా బాలీవుడ్ లో అలియా భట్ తర్వాత మోస్ట్ యంగెస్ట్ మదర్ గా పేరు తెచ్చుకుంటుందని అప్పుడే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రెగ్నెన్సీ ఇంకా ప్రారంభంలోనే ఉంది కాబట్టి ఇంకో రెండు నెలలు షూటింగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే యష్ టాక్సిక్ టీమ్ పరుగులు పెడుతోందట.
కియారా సీన్లు, పాటలు, కాంబినేషన్ సన్నివేశాలు వగైరా వేగంగా పూర్తి చేసే పనిలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఉన్నట్టు బెంగళూరు టాక్. నిజానికి తన పెర్ఫార్మన్స్ నచ్చక యష్ హీరోయిన్ ని మార్చమని చెప్పాడనే పుకారు ఓ రెండు వారాల క్రితం గట్టిగానే చక్కర్లు కొట్టింది. కానీ అందులో నిజం లేదు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు అమెరికా, రాజమండ్రిలో జరిగినప్పుడు కియారా వాటికి దూరంగా ఉంది. కేవలం బిగ్ బాస్ ఈవెంట్ లో మాత్రమే పాల్గొంది. దానికి కారణం కూడా గర్భం ఖరారయ్యే టైంలోనే అడగటం వల్ల చేయలేకపోయిందని వినిపిస్తోంది. అదెలాగూ ఫ్లాప్ అయ్యింది కాబట్టి తన గైర్హాజరు హైలైట్ కాలేదు.
వార్ 2లోనూ కియారా ఉంది. కాకపోతే తన పోర్షన్లు అయాన్ ముఖర్జీ దాదాపు పూర్తి చేసినట్టు సమాచారం. ఇంకొంచెం ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉన్నా ఆమె పాల్గొనడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటొచ్చి డాన్ 3 కోసం రణ్వీర్ సింగ్ కు జోడిగా చేసే ప్రయత్నాలకు మాత్రం బ్రేక్ పడ్డట్టే. భరత్ అనే నేనుతో టాలీవుడ్ కు వచ్చిన కియారా రామ్ చరణ్ తో చేసిన రెండు సినిమాలు డిజాస్టర్ మూటగట్టుకుంది. ఎక్కువగా బాలీవుడ్ కే అంకితమైపోయి ఇప్పుడు తల్లయ్యే క్రమంలో బ్రేక్ తీసుకునే ఉద్దేశంతో ఉందట. ఒకవేళ టాక్సిక్ కనక పార్ట్ 2 ఉంటే మాత్రం ఏడాది తర్వాతే డేట్లు ఇస్తానని చెప్పిందట. దానికింకా చాలా టైం ఉంది.
This post was last modified on March 2, 2025 4:59 am
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…