ప్రపంచంలోని బెస్ట్ ఫిలిం మేకర్స్ గురించి చెప్పమంటే అందులో ఖచ్చితంగా వినిపించే పేరు క్రిస్టోఫర్ నోలన్. ఆయన సినిమాలు కొందరికి అర్థం కాకపోవచ్చేమో కానీ ఎందరో దర్శకులు రచయితలకు అవి కరదీపికలుగా నిలిచాయి. ప్రేక్షకుల్లో నోలన్ క్లాసిక్స్ కి చాలా పేరుంది. వాటిలో ఓపెన్ హెయిమర్ ఒకటి. తెలుగు డబ్బింగ్ చేయకపోయినా సరే ఏపీ తెలంగాణలో మంచి వసూళ్లు రాబట్టడమే దానికి సాక్ష్యం. ఇటీవలే ఇంటర్ స్టెల్లార్ ని రీ రిలీజ్ చేస్తే అదేదో కొత్త విడుదలన్న రేంజ్ లో ఆడియన్స్ ఎగబడి చూశారు. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సులో వారం రోజులు టికెట్లు దొరికితే ఒట్టు.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే బాలీవుడ్ రామాయణం నిర్మాత నమిత్ మల్హోత్రా ఓపెన్ హెయిమర్ తోనే తన చిత్రాన్ని పోలుస్తున్నారు కాబట్టి. 2026లో మొదటి భాగం రిలీజవుతున్న సంగతి తెలిసిందే. రాముడిగా రన్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న ఈ ఇతిహాస గాథ షూటింగ్ రెగ్యులర్ షెడ్యూల్స్ లో జరుపుతూనే ఉన్నారు. మనకు సంబంధించిన కథే అయినప్పటికీ యూనివర్సల్ గా ప్రతి ఒక్కరికి నచ్చే స్థాయిలో ఇంకా చెప్పాలంటే ఓపెన్ హెయిమర్, ఫారెస్ట్ గంప్ లాగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే స్థాయిలో ఉంటుందని ఊరిస్తున్నారు. బడ్జెట్ పైకి చెప్పడం లేదు కానీ అయిదు వందల కోట్ల పైమాటేనని ముంబై టాక్.
ఆదిపురుష్ లాంటి సినిమాలకు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ దృష్టిలో ఉంచుకుని గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నారు. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ టార్గెట్ చేసుకున్న దర్శకుడు నితిష్ తివారి భారతీయ తెరమీద ఇప్పటిదాకా చూడని అనుభూతి కలిగిస్తానని ఊరిస్తున్నారు. సాయిపల్లవి కెరీర్ కి ఇది చాలా కీలకం. హిట్టయ్యిందా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. యానిమల్ లాంటి వయొలెంట్ పాత్ర పోషించక రన్బీర్ కపూర్ కు సైతం రామాయణం ఛాలెంజింగే. రావణుడిగా యష్ మేకోవర్ ప్రధాన ఆకర్షణ కానుంది. సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, అరుణ్ గోవిల్ ఇతర తారాగణం.
This post was last modified on March 1, 2025 4:45 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…