ప్రపంచంలోని బెస్ట్ ఫిలిం మేకర్స్ గురించి చెప్పమంటే అందులో ఖచ్చితంగా వినిపించే పేరు క్రిస్టోఫర్ నోలన్. ఆయన సినిమాలు కొందరికి అర్థం కాకపోవచ్చేమో కానీ ఎందరో దర్శకులు రచయితలకు అవి కరదీపికలుగా నిలిచాయి. ప్రేక్షకుల్లో నోలన్ క్లాసిక్స్ కి చాలా పేరుంది. వాటిలో ఓపెన్ హెయిమర్ ఒకటి. తెలుగు డబ్బింగ్ చేయకపోయినా సరే ఏపీ తెలంగాణలో మంచి వసూళ్లు రాబట్టడమే దానికి సాక్ష్యం. ఇటీవలే ఇంటర్ స్టెల్లార్ ని రీ రిలీజ్ చేస్తే అదేదో కొత్త విడుదలన్న రేంజ్ లో ఆడియన్స్ ఎగబడి చూశారు. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సులో వారం రోజులు టికెట్లు దొరికితే ఒట్టు.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే బాలీవుడ్ రామాయణం నిర్మాత నమిత్ మల్హోత్రా ఓపెన్ హెయిమర్ తోనే తన చిత్రాన్ని పోలుస్తున్నారు కాబట్టి. 2026లో మొదటి భాగం రిలీజవుతున్న సంగతి తెలిసిందే. రాముడిగా రన్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న ఈ ఇతిహాస గాథ షూటింగ్ రెగ్యులర్ షెడ్యూల్స్ లో జరుపుతూనే ఉన్నారు. మనకు సంబంధించిన కథే అయినప్పటికీ యూనివర్సల్ గా ప్రతి ఒక్కరికి నచ్చే స్థాయిలో ఇంకా చెప్పాలంటే ఓపెన్ హెయిమర్, ఫారెస్ట్ గంప్ లాగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే స్థాయిలో ఉంటుందని ఊరిస్తున్నారు. బడ్జెట్ పైకి చెప్పడం లేదు కానీ అయిదు వందల కోట్ల పైమాటేనని ముంబై టాక్.
ఆదిపురుష్ లాంటి సినిమాలకు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ దృష్టిలో ఉంచుకుని గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నారు. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ టార్గెట్ చేసుకున్న దర్శకుడు నితిష్ తివారి భారతీయ తెరమీద ఇప్పటిదాకా చూడని అనుభూతి కలిగిస్తానని ఊరిస్తున్నారు. సాయిపల్లవి కెరీర్ కి ఇది చాలా కీలకం. హిట్టయ్యిందా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. యానిమల్ లాంటి వయొలెంట్ పాత్ర పోషించక రన్బీర్ కపూర్ కు సైతం రామాయణం ఛాలెంజింగే. రావణుడిగా యష్ మేకోవర్ ప్రధాన ఆకర్షణ కానుంది. సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, అరుణ్ గోవిల్ ఇతర తారాగణం.
This post was last modified on March 1, 2025 4:45 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…