ప్రపంచంలోని బెస్ట్ ఫిలిం మేకర్స్ గురించి చెప్పమంటే అందులో ఖచ్చితంగా వినిపించే పేరు క్రిస్టోఫర్ నోలన్. ఆయన సినిమాలు కొందరికి అర్థం కాకపోవచ్చేమో కానీ ఎందరో దర్శకులు రచయితలకు అవి కరదీపికలుగా నిలిచాయి. ప్రేక్షకుల్లో నోలన్ క్లాసిక్స్ కి చాలా పేరుంది. వాటిలో ఓపెన్ హెయిమర్ ఒకటి. తెలుగు డబ్బింగ్ చేయకపోయినా సరే ఏపీ తెలంగాణలో మంచి వసూళ్లు రాబట్టడమే దానికి సాక్ష్యం. ఇటీవలే ఇంటర్ స్టెల్లార్ ని రీ రిలీజ్ చేస్తే అదేదో కొత్త విడుదలన్న రేంజ్ లో ఆడియన్స్ ఎగబడి చూశారు. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సులో వారం రోజులు టికెట్లు దొరికితే ఒట్టు.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే బాలీవుడ్ రామాయణం నిర్మాత నమిత్ మల్హోత్రా ఓపెన్ హెయిమర్ తోనే తన చిత్రాన్ని పోలుస్తున్నారు కాబట్టి. 2026లో మొదటి భాగం రిలీజవుతున్న సంగతి తెలిసిందే. రాముడిగా రన్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న ఈ ఇతిహాస గాథ షూటింగ్ రెగ్యులర్ షెడ్యూల్స్ లో జరుపుతూనే ఉన్నారు. మనకు సంబంధించిన కథే అయినప్పటికీ యూనివర్సల్ గా ప్రతి ఒక్కరికి నచ్చే స్థాయిలో ఇంకా చెప్పాలంటే ఓపెన్ హెయిమర్, ఫారెస్ట్ గంప్ లాగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే స్థాయిలో ఉంటుందని ఊరిస్తున్నారు. బడ్జెట్ పైకి చెప్పడం లేదు కానీ అయిదు వందల కోట్ల పైమాటేనని ముంబై టాక్.
ఆదిపురుష్ లాంటి సినిమాలకు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ దృష్టిలో ఉంచుకుని గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నారు. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ టార్గెట్ చేసుకున్న దర్శకుడు నితిష్ తివారి భారతీయ తెరమీద ఇప్పటిదాకా చూడని అనుభూతి కలిగిస్తానని ఊరిస్తున్నారు. సాయిపల్లవి కెరీర్ కి ఇది చాలా కీలకం. హిట్టయ్యిందా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. యానిమల్ లాంటి వయొలెంట్ పాత్ర పోషించక రన్బీర్ కపూర్ కు సైతం రామాయణం ఛాలెంజింగే. రావణుడిగా యష్ మేకోవర్ ప్రధాన ఆకర్షణ కానుంది. సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, అరుణ్ గోవిల్ ఇతర తారాగణం.
This post was last modified on March 1, 2025 4:45 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…