నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ‘ప్యారడైజ్’ టీజర్ కోసం తన అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు నానితో ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ముందు నుంచే అంచనాలు పెరిగాయి. ఈ సినిమా నుంచి ‘రా స్టేట్మెంట్’ పేరుతో ఈ నెల మూడో తారీఖున ఒక రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏకంగా ఎనిమిది భాషల్లో.. అందులోనూ ఇంగ్లిష్, స్పానిష్ లాంగ్వేజెస్లోనూ ఈ టీజర్ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో క్యూరియాసిటీ పెరిగింది. ఈ టీజర్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపేలా ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం.
టీజర్ చాలా ‘రా’గా ఉంటుందని.. ఘాటైన బూతులు కూడా ఉంటాయని చెబుతున్నారు. ‘ప్యారడైజ్’ టీజర్లో ఫస్ట్ డైలాగ్లోనే ఒక పచ్చి బూతు ఉంటుందని.. అది విని ప్రేక్షకులు షాకైపోవడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ టీజర్లో నాని లుక్ నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంటుందని.. అది చూసి ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ కావడం ఖాయమని సమాచారం. లుక్ పరంగా ఇప్పటిదాకా ఏ హీరో చేయని సాహసం ఈ సినిమా కోసం నాని చేశాడట.
‘దసరా’లో నానిని నెవర్ బిఫోర్ రగ్డ్ లుక్లో చూపించి షాకిచ్చాడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడిక ‘ప్యారడైజ్’లో షాక్ ఫ్యాక్టర్ అంతకుమించే ఉంటుందని.. ఈ టీజర్ వచ్చాక సోషల్ మీడియా షేకైపోవడం ఖాయమని చాలా ధీమాగా చెబుతున్నారు టీజర్ చూసిన వాళ్లు. ఈ సినిమాతో నాని వేరే లెవెల్కు వెళ్లబోతున్నాడని స్క్రిప్టు గురించి తెలిసిన వాళ్లు చెబుతున్నారు. ‘దసరా’లో మాస్ చూస్తే.. ‘ప్యారడైజ్’లో ఊర మాస్ చూబోతున్నారని అంటున్నారు. ‘దసరా’ను నిర్మించిన సుధాకర్ చెరుకూరినే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు.
This post was last modified on March 1, 2025 2:51 pm
బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత హీరో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ కెరీర్ ఫేజ్ చూశాడు. ఒక టాప్ డైరెక్టర్ క్రియేట్ చేసిన…
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…