గత కొంత కాలంగా అజిత్ సినిమాలు యునానిమస్ గా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. వలిమై, తునివుకి తమిళనాడులో పెద్ద నెంబర్లు వచ్చాయి కానీ ఫ్యాన్స్ సైతం వాటి గురించి గర్వంగా చెప్పుకోలేని యావరేజ్ సినిమాలు. ఇక విడాముయార్చి (పట్టుదల) గురించి చెప్పనక్కర్లేదు. మరీ దారుణంగా పోయింది. కేవలం పాతిక రోజులకే ఓటిటి రిలీజ్ అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అజిత్ కు ఒక పక్కా మాస్ ఎంటర్ టైనర్ ని ఇచ్చే బాధ్యత తెలుగు నిర్మాణ సంస్థ తీసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లే టీజర్ ఇవాళ విడుదల చేశారు.
దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ హీరో అజిత్ కు వీరాభిమాని. తన ఫ్యానిజం ఏ స్థాయి ఉందో గుడ్ బ్యాడ్ అగ్లీలో చూపిస్తానని ముందు నుంచి చెబుతూ వచ్చాడు. దానికి తగ్గట్టే నిమిషన్నర వీడియోలో అజిత్ అసలు మాస్ ని బయటికి తెచ్చేశాడు. గ్యాంగ్ స్టార్ డ్రామా అయినప్పటికీ అజిత్ మూడు నాలుగు షేడ్స్ లో కనిపిస్తున్నాడు. యవకుడితో మొదలుపెట్టి స్టయిలిష్ గా ఉండే వృద్ధుడి దాకా అన్ని వయసులు కవర్ చేసినట్టున్నారు. ఆయన పక్కన సునీల్ కు ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. యాక్షన్ ఎపిసోడ్స్, ఫైట్స్, మాస్ మసాలాలు అన్ని కూర్చి అభిమానులను టార్గెట్ చేసుకున్నాడు.
మార్క్ ఆంటోనీ ఛాయలైతే గుడ్ బ్యాడ్ అగ్లీలో కనిపిస్తున్నాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, ప్రొడక్షన్ వేల్యూస్, టెక్నికల్ వర్క్ అన్నీ ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి. ఎంత రెగ్యులర్ గా ఉన్నా సరే తమిళనాడులో మాత్రం ఈ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్నేసి వేరియేషన్లలో అజిత్ కనిపిస్తే రికార్డులు గల్లంతే. బిల్లా, గ్యాంబ్లర్, రెడ్, వరలారు ఇలా అజిత్ కల్ట్ బ్లాక్ బస్టర్స్ అన్నీ మిక్సిలో వేసినట్టున్న జిబియు ఏప్రిల్ 10 విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో అడుగు పెట్టనుంది. మైత్రినే నిర్మించిన హిందీ మూవీ సన్నీడియోల్ జాత్ కూడా దీంతో పాటే రిలీజ్ కానుంది.
This post was last modified on February 28, 2025 7:43 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…