పూజా హెగ్డే హీరోయిన్గా అరంగేట్రం చేసి దశాబ్దం దాటింది. కానీ ఇన్నేళ్లు గడిచినా ఆమెను ఒక గ్లామర్ హీరోయిన్గానే చూస్తున్నారు. ఆమె నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసింది తక్కువ. ‘అరవింద సమేత’ లాంటి కొన్ని చిత్రాల్లో మాత్రమే కొంత నటనకు ప్రాధాన్యం లభించింది. అలాంటి పాత్రల్లోనూ ఆమె గ్లామరే హైలైట్ అయింది తప్ప.. నటన గురించి పెద్దగా మాట్లాడుకోలేదు. అందం కోణంలో తప్ప నటన కోసం చూడని కొద్దిమంది హీరోయిన్లలో పూజా ఒకరని చెప్పాలి. అలాంటి హీరోయిన్లను డీగ్లామరస్, పెయిన్ ఫుల్ క్యారెక్టర్లలో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడరు కూడా.
గతంలో కాజల్ అగర్వాల్ కూడా ఈ కోవకే చెందేది. ఐతే పూజా కెరీర్లో తొలిసారిగా డీగ్లామరస్ రోల్ చేయబోతోందని.. ఆమెను ఒక షాకింగ్ క్యారెక్టర్లో రాఘవ లారెన్స్ చూపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కాంఛన సిరీస్లో నాలుగో సినిమా తీయడానికి రాఘవ లారెన్స్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డేను కథానాయికగా ఎంచుకున్నాడు. ఆమె ఈ సినిమాలో చెవిటి-మూగ అమ్మాయిగా కనిపించబోతోందనే వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
పూజా లాంటి గ్లామర్ హీరోయిన్ ఇలాంటి పాత్ర చేయడం ఏంటి అని తన ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇంతకుముందు ‘గంగ’ (కాంఛన-3)లో సినిమాలో నిత్యా మీనన్ను దివ్యాంగురాలిగా చూపిస్తే బాగానే కుదిరింది. బేసిగ్గా నిత్య పెర్ఫామర్ కావడం వల్ల ఆ పాత్ర పండింది. కానీ పూజాను చెవిటి-మూగ అమ్మాయిగా చూపిస్తే తన ఫ్యాన్స్ తట్టుకోగలరా అన్నది సందేహం. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో చేసి తామేంటో నిరూపించుకోవాలని అందరు హీరోయిన్లకూ ఉంటుంది కానీ.. పూజా మాత్రం ఇలాంటి పాత్రకు మిస్ ఫిట్ ఏమో అనే సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on February 26, 2025 10:59 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…