Movie News

తండ్రి మరణం… అయినా ప్రభాస్ పెద్ద మనసు

సినీ రంగంలో చాలామంది చిన్న చిన్న సాయాలు చేసి పెద్ద స్థాయిలో పబ్లిసిటీ చేసుకునేవాళ్లే. కానీ కొందరు మాత్రం సైలెంటుగా సేవా కార్యక్రమాలు చేస్తూ వాటి గురించి బయటికి చెప్పుకోరు. అలాంటి వాళ్లలో ప్రభాస్ ఒకరని అంటారు. ఏదైనా ప్రకృతి విపత్తులు తలెత్తినపుడు, వేరే సందర్భాల్లో ప్రభాస్ ఎలా స్పందిస్తాడో తెలిసిందే. విరాళాలు ప్రకటించడంలో ముందుంటాడు. పైగా పెద్ద మొత్తంలో సాయాలు అందిస్తాడు. అవి కాక ప్రభాస్ పబ్లిసిటీకి దూరంగా సేవా కార్యక్రమాలు చేయడం, తనకు తెలిసిన వాళ్లెవరైనా ఇబ్బందుల్లో ఉంటే సాయాలు అందించడం లాంటివి చేస్తుంటాడని సన్నిహితులు చెబుతుంటారు.

అలా ప్రభాస్ చేసిన ఓ ముఖ్యమైన సాయం గురించి రైటర్ తోట ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం అతడిది ఎంత పెద్ద మనసో తెలియజేస్తోంది. 2010లో ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు చనిపోయిన సంగతి తెలిసిందే. తండ్రి మరణం ఎవరికైనా ఎంతో దు:ఖాన్ని కలిగిస్తుంది. ప్రభాస్ కూడా ఆ సమయంలో తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. అలాంటి టైంలో కూడా తాను అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉంటే.. ఆ విషయం తెలుసుకుని వైద్య ఖర్చుల కోసం సొంత డబ్బులు పంపించాడని తోట ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.

తండ్రి మరణిస్తే ఎవ్వరైనా తీవ్రమైన దు:ఖంలో ఉంటారని.. అలాంటి సమయంలో వేరే విషయాలేవీ పట్టించుకోరని.. కానీ ప్రభాస్ మాత్రం తన సినిమాకు రచయితగా పని చేశాననే కారణంతో తన ట్రీట్మెంట్ కోసం ఒక వ్యక్తి ద్వారా డబ్బులు పంపించి ఆదుకున్నాడని ప్రసాద్ తెలిపారు. తాను అప్పటికి ‘బిల్లా’ సినిమా కోసం పని చేశానని.. కాగా ఇన్నేళ్లకు మళ్లీ ప్రభాస్ నటించిన ‘కన్నప్ప’ చిత్రానికి రచయితగా వర్క్ చేయడం ఆనందంగా ఉందని తోట ప్రసాద్ అన్నారు. మంచు విష్ణు లీడ్ రోల్ చేసిన ‘కన్నప్ప’లో ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Kumar

Recent Posts

ఎక్కడ చూసినా GV ప్రకాష్ సంగీతమే

టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…

21 minutes ago

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

3 hours ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

4 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ?

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

6 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

10 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

10 hours ago