ఎల్లుండి విడుదల కాబోతున్న మజాకా మీద అంచనాలు బాగానే నెలకొన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తరహాలో వెరైటీగా ఏవో ప్రమోషన్లు చేయబోయారు కానీ అవంత వర్కౌట్ కాలేదని సోషల్ మీడియా స్పందన చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ వచ్చాక హైప్ మారింది. ధమాకా తరహాలో దర్శకుడు త్రినాథరావు నక్కిన మరోసారి వినోదాన్ని నమ్ముకున్న వైనం స్పష్టమయ్యింది. సందీప్ కిషన్ తో సమానంగా రావు రమేష్ పాత్రను డిజైన్ చేయడం చూస్తే తండ్రి కొడుకుల కామెడీని రచయిత ప్రసన్నకుమార్ గట్టిగానే దట్టించినట్టు కనిపిస్తోంది. బాక్సాఫీస్ డ్రైగా ఉన్న తరుణంలో మజాకా నిజమైన తడాకాని చూపించాల్సి ఉంటుంది.
ఎందుకంటే సుమారు తొమ్మిది కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ టాక్. ఇది మరీ భారీ మొత్తం కాదు కానీ సందీప్ కిషన్ ఇమేజ్ కి అంత సులభమూ కాదు. కాకపోతే అదిరిపోయిందనే టాక్ వస్తే వారం లోపే సులభంగా రికవరీ అవ్వొచ్చు. యావరేజ్ అనిపించుకున్నా చాలు పది పదిహేను రోజుల్లో లాంఛనం అయిపోతుంది. కానీ ఆడియన్స్ ఈ కంటెంట్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కీలకం. అసలే ఫిబ్రవరి ఒకరకంగా నాన్ సీజన్ లాంటిది. పిల్లల పరీక్షల మూడ్ లో పెద్దలు కూడా థియేటర్లకు దూరంగా ఉన్నారు. తండేల్ ఈ కారణంగానే వంద కోట్లకు దగ్గరగా ఉన్నప్పుడే స్లో అయిపోయింది.
తర్వాత వచ్చినవేవి పెద్దగా నిలబడలేదు. ఒక్క రిటర్న్ అఫ్ ది డ్రాగన్ మాత్రమే యూత్ ని ఆకట్టుకుంటూ వసూళ్లు బాగానే రాబడుతోంది. కానీ మజాకాకు స్ట్రెయిట్ మూవీగా పెద్ద బాధ్యత ఉంది. ఎలాగూ ఇంకో వారం రెండు వారాల వరకు చెప్పుకోదగ్గ రిలీజ్ లేదు. సో బాగుందనే మాట వినిపిస్తే మాత్రం సందీప్ కిషన్ కెరీర్ లోనే పెద్ద నెంబర్లు నమోదు చేయొచ్చు. పాటలు బాగానే ఉన్నప్పటికీ ఛార్ట్ బస్టర్స్ అయ్యే రేంజ్ లో అనిపించకపోవడం కొంత లోటే అనిపిస్తున్నా తెరమీదకొచ్చాక మరింత బెటర్ గా అనిపిస్తాయేమో చూడాలి. రీతూ వర్మ రూటు మార్చి కమర్షియల్ హీరోయిన్ కావడం మజాకాకున్న మరో ఆకర్షణ.
This post was last modified on February 24, 2025 1:53 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…