సార్ తర్వాత ధనుష్ చేస్తున్న తెలుగు సినిమా కుబేర ఎప్పుడు రిలీజవుతుందో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజవుతున్నారు. నాగ చైతన్య తండేల్ సక్సెస్ ఎంజాయ్ చేశాక ఇప్పుడు నాగార్జున కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కుబేర ఆ లోటు తీరుస్తుందని వాళ్ళ నమ్మకం. అయితే దర్శకుడు శేఖర్ కమ్ముల పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడే వ్యక్తి. అంత సులభంగా రాజీ పడరు. ఈ కారణంగానే లేట్ అవుతోందనే కామెంట్స్ ముందు నుంచి ఉన్నాయి. ఇంకోపక్క ధనుష్ కుబేర సంగతి ఏమో కానీ తనే హీరోగా ఇడ్లి కడాయ్ స్వీయ దర్శకత్వంలో పూర్తి చేసుకుని బాలీవుడ్ మూవీ తేరి మేరీ ఇష్క్ మేలో బిజీ అయిపోయాడు.
ఇదిలా ఉండగా కుబేర టైటిల్ మాదంటూ నరేందర్ అనే నిర్మాత నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి వివాదం రేపడం హాట్ టాపిక్ అయ్యింది. 2023లోనే తాము రిజిస్టర్ చేసుకున్నామని ఆయన వాదన. గతంలో ఇదే సమస్య నాని గ్యాంగ్ లీడర్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కుబేరకు కూడా అలాంటి పరిష్కారం ఏదో ఒకటి చూస్తారు కానీ కీలకమైన వేసవి సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో రిలీజ్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడం ఫ్యాన్స్ లో ఆందోళన రేపుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన కుబేరలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించడం మరో ప్రధాన ఆకర్షణ.
మార్చ్ లో ఛాన్స్ లేదు. ఏప్రిల్ స్లాట్స్ ఫుల్ అయిపోయాయి. జాక్, ఘాటీ, గుడ్ బ్యాడ్ అగ్లీ, కన్నప్ప ఇలా ప్యాన్ ఇండియా సినిమాలన్నీ క్యూ కట్టాయి. ఒకవేళ మే అనుకున్నా అదేదో ఇప్పుడే ప్రకటిస్తే బెటర్. తిరిగి జూన్ లో చిరంజీవి విశ్వంభర, రవితేజ మాస్ జాతర లాంటివి వెయిట్ చేస్తుంటాయి. సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్న కుబేర ఇంత లేట్ చేయడం విచిత్రమే. డబ్బు నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాని ఎంచుకునే శేఖర్ కమ్ముల ట్రీట్ మెంట్ ఈసారి చాలా కొత్తగా ఉంటుందట. దీని తర్వాత న్యాచురల్ స్టార్ నానితో చేసే ప్లాన్ లో ఉన్నారు కమ్ముల. కాకపోతే ప్రస్తుతానికి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు.
This post was last modified on February 23, 2025 11:33 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…