Movie News

ఫ్యాన్స్‌కి రుచించని రజినీ కొత్త సినిమా కబురు

లేటు వయసులో మంచి స్పీడుతో సినిమాలు చేసుకుపోతన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. జైలర్.. లాల్ సలామ్.. వేట్టయాన్.. ఇలా 15 నెలల వ్యవధిలో ఆయన్నుంచి మూడు సినిమాలు వచ్చాయి. చివరగా గత ఏడాది అక్టోబరులో ‘వేట్టయాన్’తో పలకరించిన సూపర్ స్టార్.. ఈ వేసవి చివర్లో ‘కూలీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉండగా.. ఆల్రెడీ తర్వాతి చిత్రం ‘జైలర్-2’ను పట్టాలెక్కించేస్తున్నారు. దీని తర్వాత రజినీ చేయబోయే సినిమా గురించి ఆసక్తికర ప్రచారాలు జరుగుతున్నాయి.

తాజాగా విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రజినీతో అతను కథా చర్చలు జరుపుతున్నాడని.. బేసిక్ లైన్ చెప్పి ఒక స్క్రిప్టు మీద పని చేస్తున్నాడని కోలీవుడ్ మీడియా వెల్లడించింది. ఐతే ఈ అప్‌డేట్ రజినీ అభిమానులు ఏమంత ఎగ్జైట్ చేయట్లేదు. వెట్రిమారన్ ప్రస్తుతం తమిళంలో ఉన్న బెస్ట్ డైరెక్టర్లలో ఒకడనడంలో సందేహం లేదు. కానీ అతడి సినిమాలకు క్రిటికల్ అక్లైమ్ వస్తుంది కానీ.. కమర్షియల్‌గా ఒక స్థాయికి మించి ఆడవు. అందులోనూ చివరి చిత్రం ‘విడుదల-2’ అయితే పూర్తిగా నిరాశపరిచింది.

వెట్రిమారన్ శైలి ప్రకారం చూస్తే రజినీకి సెట్ కాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రజినీ కమర్షియల్ టచ్ లేకుండా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తే సరైన ఫలితం ఉండదన్నది వారి వాదన. అందుకు ‘వేట్టయాన్’ లాంటి సినిమాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. వేట్టయాన్ క్రిటికల్ అక్లైమ్ తెచ్చుకున్నప్పటికీ సరిగా ఆడలేదు. రజినీ సినిమాల్లో కమర్షియల్ టచ్ ఉంటేనే బాగా ఆడతాయని.. ‘జైలర్’ లాంటి సినిమాలే అందుకు రుజువని.. కాబట్టి సూపర్ స్టార్ వెట్రిమారన్ లాంటి దర్శకులతో సినిమాలు చేయకపోవడం మంచిదనే అభిప్రాయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on February 23, 2025 9:04 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

55 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

58 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago