ఒకప్పుడు పందెం కోడి, రన్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డు ఉండొచ్చేమో కానీ గత కొంత కాలంగా దర్శకుడు లింగుస్వామి ఇస్తున్న ఫ్లాపులు మామూలువి కాదు. ఎప్పుడో పదమూడు సంవత్సరాల క్రితం మాధవన్ వెట్టై తర్వాత మళ్ళీ సక్సెస్ చూడనే లేదు. పందెం కోడి 2 సోసోగా అడగా అంతకు ముందు సూర్య సికందర్ (అంజాన్) దారుణంగా పోయింది. ఇవన్నీ పట్టించుకోకుండా 2022లో మన రామ్ నమ్మి అవకాశం ఇస్తే ది వారియర్ అంటూ రొట్ట రొటీన్ కథతో సూపర్ డిజాస్టర్ ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఆఫర్ లేదు. తాజాగా ఆయన పేల్చిన బాంబు వింటే ఆశ్చర్యం షాక్ రెండూ ఒకేసారి కలుగుతాయి.
త్వరలో తాను మహాభారత కథను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ఏకంగా ఏడు వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. అర్జునుడు – అభిమన్యుడు పాత్రలను హైలైట్ చేస్తూ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ వాడి ఇప్పటిదాకా చూడని ఎక్స్ పీరియన్స్ ఇస్తానని హామీ ఇస్తున్నారు. నిర్మాత ఎవరయ్యా అంటే త్వరలోనే ఆ వివరాలు తెలుస్తాయి, వేచి చూడమని చెబుతున్నారు. తమిళంలో అరవై ఏళ్ళ క్రితం శివాజీ గణేశన్ కర్ణన్ తర్వాత మళ్ళీ ఎవరూ ఈ గాథని టచ్ చేయలేదు. ఇప్పుడు లింగుస్వామి ఇంత పెద్ద స్కేల్ లో అది కూడా తండ్రి కొడుకుల ఎపిసోడ్ మీద ఎక్కువ దృష్టి పెడతానని చెప్పడం ఊహించని ట్విస్టు.
సరే ప్రకటన వచ్చే దాకా నమ్మలేం కానీ నిజంగా లింగుస్వామికి అంత సీన్ ఉందా అనేదే పెద్ద ప్రశ్న. గతంలో సుందర్ సి ఇదే తరహాలో బాహుబలిని తలదన్నే రీతిలో సంఘమిత్రని తెరకెక్కిస్తానని ఓపెనింగ్ చేసి, పోస్టర్ కూడా వదిలారు. మల్టీస్టారర్స్ ని పెట్టుకున్నారు. తీరా చూస్తే అది రెగ్యులర్ షూట్ కు వెళ్లకుండానే ఆగిపోయింది. ఇది జరిగి దశాబ్దం దాటిపోయింది. మరి లింగుస్వామి అయినా చెప్పిన మాట ప్రకారం తీస్తారో లేదో చూడాలి. అయినా పులిని చూసి వాత పెట్టుకున్నట్టు కోలీవుడ్ దర్శకులు రాజమౌళిని మరిపించేలా ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఏ ఒక్కటి వర్కౌట్ కాకపోవడం బ్యాడ్ లక్.
This post was last modified on February 22, 2025 9:53 pm
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…
కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అవి పూర్తిగా…
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…