ఒకప్పుడు పందెం కోడి, రన్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డు ఉండొచ్చేమో కానీ గత కొంత కాలంగా దర్శకుడు లింగుస్వామి ఇస్తున్న ఫ్లాపులు మామూలువి కాదు. ఎప్పుడో పదమూడు సంవత్సరాల క్రితం మాధవన్ వెట్టై తర్వాత మళ్ళీ సక్సెస్ చూడనే లేదు. పందెం కోడి 2 సోసోగా అడగా అంతకు ముందు సూర్య సికందర్ (అంజాన్) దారుణంగా పోయింది. ఇవన్నీ పట్టించుకోకుండా 2022లో మన రామ్ నమ్మి అవకాశం ఇస్తే ది వారియర్ అంటూ రొట్ట రొటీన్ కథతో సూపర్ డిజాస్టర్ ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఆఫర్ లేదు. తాజాగా ఆయన పేల్చిన బాంబు వింటే ఆశ్చర్యం షాక్ రెండూ ఒకేసారి కలుగుతాయి.
త్వరలో తాను మహాభారత కథను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ఏకంగా ఏడు వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. అర్జునుడు – అభిమన్యుడు పాత్రలను హైలైట్ చేస్తూ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ వాడి ఇప్పటిదాకా చూడని ఎక్స్ పీరియన్స్ ఇస్తానని హామీ ఇస్తున్నారు. నిర్మాత ఎవరయ్యా అంటే త్వరలోనే ఆ వివరాలు తెలుస్తాయి, వేచి చూడమని చెబుతున్నారు. తమిళంలో అరవై ఏళ్ళ క్రితం శివాజీ గణేశన్ కర్ణన్ తర్వాత మళ్ళీ ఎవరూ ఈ గాథని టచ్ చేయలేదు. ఇప్పుడు లింగుస్వామి ఇంత పెద్ద స్కేల్ లో అది కూడా తండ్రి కొడుకుల ఎపిసోడ్ మీద ఎక్కువ దృష్టి పెడతానని చెప్పడం ఊహించని ట్విస్టు.
సరే ప్రకటన వచ్చే దాకా నమ్మలేం కానీ నిజంగా లింగుస్వామికి అంత సీన్ ఉందా అనేదే పెద్ద ప్రశ్న. గతంలో సుందర్ సి ఇదే తరహాలో బాహుబలిని తలదన్నే రీతిలో సంఘమిత్రని తెరకెక్కిస్తానని ఓపెనింగ్ చేసి, పోస్టర్ కూడా వదిలారు. మల్టీస్టారర్స్ ని పెట్టుకున్నారు. తీరా చూస్తే అది రెగ్యులర్ షూట్ కు వెళ్లకుండానే ఆగిపోయింది. ఇది జరిగి దశాబ్దం దాటిపోయింది. మరి లింగుస్వామి అయినా చెప్పిన మాట ప్రకారం తీస్తారో లేదో చూడాలి. అయినా పులిని చూసి వాత పెట్టుకున్నట్టు కోలీవుడ్ దర్శకులు రాజమౌళిని మరిపించేలా ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఏ ఒక్కటి వర్కౌట్ కాకపోవడం బ్యాడ్ లక్.
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…
షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…