అభిమానులు హెచ్చుతగ్గుల్లో ఎంత ఊహించుకున్నా వాళ్ళు హరిహర వీరమల్లుని తక్కువంచనా వేస్తున్న మాట వాస్తవం. ఓజి నామస్మరణతో దాని మైకంలోనే ఉన్నారు కానీ నిజానికి చావాని మించిన చారిత్రాత్మక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నారనేది థియేటర్లోనే తెలుసుకుంటారని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం వీరమల్లు పాత్ర సర్వాయి పాపన్న కథ ఆధారంగా రాసుకున్నారట. ఈ మహాయోధుడి పూర్తి పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. 1650లో జన్మించి శైవ మతస్థుడే అయినప్పటికీ కులాలు, మతాలకతీతంగా ఒక పెద్ద సైన్యం తయారు చేసుకున్నాడు.
తురుష్క్ సైనికులు పన్నులు వసూలు చేసే క్రమంలో కల్లు గీసే వ్యాపారం చేస్తున్న పాపన్నతో ఒక స్నేహితుడి వల్ల తగవు పెట్టుకుంటారు. దీంతో ఉగ్రరూపం చెందిన పాపన్న వాళ్ళ తల నరకడమే కాక ఊరువాడా ఏకం చేసి మూడు వేల మందితో ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసుకుంటాడు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీకి సమాంతరంగా మొఘల్ సామ్రాజ్య ఒంటెత్తు పోకడలపై యుద్ధం చేసి గెలిచిన ఖ్యాతి ఈయన పేరు మీద ఉంది. 1700 సంవత్సర సమయంలో గోల్కొండ దాకా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇరవై దాకా కోటలను గెలుచుకున్న పాపన్న సాహసాలకు నిజాం రాజులు బెంబేలెత్తిపోయారు.
ఇలా అప్రతిహతంగా జరిగిపోతున్న జైత్రయాత్రలో చావాలో శంభాజీకి జరిగినట్టే పాపన్నకు ద్రోహం జరిగి పట్టుబడతాడు. తర్వాత జరిగేది ఊహకందనంత గొప్పగా ఉంటుందట. ఇక్కడ చెప్పింది కొన్ని విషయాలే కానీ హరిహర వీరమల్లు కోసం కేవలం పాపన్నకు సంబంధించిన ముఖ్యమైన నేపధ్యాన్ని మాత్రమే తీసుకుని చాలా మార్పులు చేశారని సమాచారం. అధికారికంగా ఇది సర్వాయి పాపన్న కథని టీమ్ ప్రకటించనప్పటికీ అబ్బురపరిచే విజువల్స్ తో పాటు వావ్ అనిపించే ఎపిసోడ్స్ చాలానే ఉంటాయట. బాహుబలి తరహాలో మొదటి భాగాన్ని మించి సీక్వెల్ కోసం ఎదురు చూసే స్థాయిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చారట.
This post was last modified on February 19, 2025 12:31 pm
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…