Movie News

థియేటర్ లో నాన్ స్టాప్ యాడ్స్ : లక్ష ఫైన్ వేసిన కోర్టు!

బెంగళూరులోని వినియోగదారుల కోర్టు సినిమా ప్రదర్శనలో ప్రకటనల వ్యవహారంపై కీలక తీర్పు ఇచ్చింది. 2024లో విడుదలైన సామ్ బహదూర్ సినిమా ప్రదర్శనకు ముందుగా, సుమారు 25 నిమిషాల పాటు ప్రసారమైన కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్స్ తన సమయాన్ని వృథా చేశాయని అభిషేక్ ఎం.ఆర్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. సినిమా ముగిసిన వెంటనే తన పనులకు వెళ్లాల్సి ఉండడంతో ఈ ఆలస్యం తీవ్ర అసౌకర్యం కలిగించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసులో కోర్టు పీవీఆర్ సినిమాస్ షో పట్ల తప్పుబట్టింది. సినిమా అసలు ప్రారంభ సమయాన్ని టికెట్లపై స్పష్టంగా చూపించాలని ఆదేశించింది. బుక్ మై షోకు ఈ వ్యవహారంలో ఎటువంటి బాధ్యత లేదని కోర్టు పేర్కొన్నప్పటికీ, థియేటర్లు మాత్రం ప్రేక్షకుల సమయాన్ని వ్యర్థం చేయడం న్యాయసమ్మతం కాదని తేల్చింది.

తమ థియేటర్లలో ఆలస్యంగా వచ్చే ప్రేక్షకులకు అనుగుణంగా ప్రకటనల సమయాన్ని పెంచుతున్నామని పీవీఆర్, ఐనాక్స్ కోర్టులో వాదించాయి. అయితే, ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. సమయానికి వచ్చిన ప్రేక్షకులను 25-30 నిమిషాలు ప్రకటనలు చూడమని అనడం అన్యాయమని పేర్కొంది. సినిమా టికెట్‌లో ప్రకటనలకు వెచ్చించే సమయాన్ని కాకుండా, నిజమైన షో టైమ్‌ను చూపించాలనే తీర్పును ఇచ్చింది.

ఈ తీర్పులో భాగంగా, పీవీఆర్, ఐనాక్స్‌లను అభిషేక్ ఎం.ఆర్‌కు ₹20,000 నష్టపరిహారం, కేసు ఖర్చుల కోసం ₹8,000 చెల్లించాలని ఆదేశించింది. అదనంగా, రూ.1 లక్షను శిక్షార్హమైన నష్టపరిహారంగా చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు తర్వాత థియేటర్లలో ప్రకటనల వ్యవస్థపై మరింత కట్టుదిట్టమైన నియంత్రణలు అమలవుతాయని భావిస్తున్నారు.

This post was last modified on February 19, 2025 10:00 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తొలి బంతికి సిక్సర్ కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…

18 minutes ago

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

1 hour ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

10 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

10 hours ago