బెంగళూరులోని వినియోగదారుల కోర్టు సినిమా ప్రదర్శనలో ప్రకటనల వ్యవహారంపై కీలక తీర్పు ఇచ్చింది. 2024లో విడుదలైన సామ్ బహదూర్ సినిమా ప్రదర్శనకు ముందుగా, సుమారు 25 నిమిషాల పాటు ప్రసారమైన కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ తన సమయాన్ని వృథా చేశాయని అభిషేక్ ఎం.ఆర్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. సినిమా ముగిసిన వెంటనే తన పనులకు వెళ్లాల్సి ఉండడంతో ఈ ఆలస్యం తీవ్ర అసౌకర్యం కలిగించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో కోర్టు పీవీఆర్ సినిమాస్ షో పట్ల తప్పుబట్టింది. సినిమా అసలు ప్రారంభ సమయాన్ని టికెట్లపై స్పష్టంగా చూపించాలని ఆదేశించింది. బుక్ మై షోకు ఈ వ్యవహారంలో ఎటువంటి బాధ్యత లేదని కోర్టు పేర్కొన్నప్పటికీ, థియేటర్లు మాత్రం ప్రేక్షకుల సమయాన్ని వ్యర్థం చేయడం న్యాయసమ్మతం కాదని తేల్చింది.
తమ థియేటర్లలో ఆలస్యంగా వచ్చే ప్రేక్షకులకు అనుగుణంగా ప్రకటనల సమయాన్ని పెంచుతున్నామని పీవీఆర్, ఐనాక్స్ కోర్టులో వాదించాయి. అయితే, ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. సమయానికి వచ్చిన ప్రేక్షకులను 25-30 నిమిషాలు ప్రకటనలు చూడమని అనడం అన్యాయమని పేర్కొంది. సినిమా టికెట్లో ప్రకటనలకు వెచ్చించే సమయాన్ని కాకుండా, నిజమైన షో టైమ్ను చూపించాలనే తీర్పును ఇచ్చింది.
ఈ తీర్పులో భాగంగా, పీవీఆర్, ఐనాక్స్లను అభిషేక్ ఎం.ఆర్కు ₹20,000 నష్టపరిహారం, కేసు ఖర్చుల కోసం ₹8,000 చెల్లించాలని ఆదేశించింది. అదనంగా, రూ.1 లక్షను శిక్షార్హమైన నష్టపరిహారంగా చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు తర్వాత థియేటర్లలో ప్రకటనల వ్యవస్థపై మరింత కట్టుదిట్టమైన నియంత్రణలు అమలవుతాయని భావిస్తున్నారు.
This post was last modified on February 19, 2025 10:00 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…