ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్లి స్థిరపడ్డ కథానాయిక ఇలియానా. హిందీలో బర్ఫీ సహా కొన్ని మంచి సినిమాలు చేశాక ఆమె నెమ్మదిగా సినీ రంగానికి దూరమైంది. కొన్నేళ్ల కిందట ఆమె మైకేల్ డోలన్ అనే విదేశీయుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇలియానా గర్భవతి అయ్యేవరకు వీరి బంధం గురించి బయటి ప్రపంచానికి తెలియదు. బిడ్డను కన్నపుడే భర్త గురించి కూడా వెల్లడించింది.
2023లో ఈ జంట మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడి పేరు.. కోవా ఫోనిక్స్ డోలన్. ఐతే రెండేళ్లు తిరిగేలోపే ఇలియానా మళ్లీ ప్రెగ్నెంట్ అయిందని, రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని నెల కిందట మళ్లీ ప్రచారం మొదలైంది. నిన్నటిదాకా ఇది జస్ట్ రూమరే. కానీ ఇప్పుడు ఆ విషయం వాస్తవమే అని వెల్లడైంది. స్వయంగా ఇలియానా ఈ విషయాన్ని కన్ఫమ్ చేసింది. ఇలియానా లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్టు చూస్తే ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం నిజమే అని తెలుస్తుంది.
కుర్కురేతో పాటు ఆంటాసిడ్ చ్యూయింగ్ గమ్స్ ప్యాకెట్లు కనిపిస్తున్న ఫొటోను ఇలియానా షేర్ చేసింది. ఇవి రెండూ పుల్లగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ”మీరు ప్రెగ్నెంట్ అని చెప్పకుండా ప్రెగ్నెంట్ అని తెలియజేయండి” అనే క్యాప్షన్ సైతం ఇలియానా జోడించింది. దీంతో అసలు విషయం జనాలకు అర్థమైపోయింది. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నందుకు ఇలియానాకు శుభాకాంక్షలు అంటూ మెసేజ్లు వెల్లువెత్తాయి.
వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డాక ఇలియానా సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. బిడ్డకు జన్మనిచ్చాక అసలు లైమ్ లైట్లో లేదు. తన ఫ్యామిలీ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పెద్దగా పోస్ట్ చేయట్లేదు. చివరగా ఆమె తెలుగులో 2018లో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on February 15, 2025 9:01 pm
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…