ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్లి స్థిరపడ్డ కథానాయిక ఇలియానా. హిందీలో బర్ఫీ సహా కొన్ని మంచి సినిమాలు చేశాక ఆమె నెమ్మదిగా సినీ రంగానికి దూరమైంది. కొన్నేళ్ల కిందట ఆమె మైకేల్ డోలన్ అనే విదేశీయుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇలియానా గర్భవతి అయ్యేవరకు వీరి బంధం గురించి బయటి ప్రపంచానికి తెలియదు. బిడ్డను కన్నపుడే భర్త గురించి కూడా వెల్లడించింది.
2023లో ఈ జంట మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడి పేరు.. కోవా ఫోనిక్స్ డోలన్. ఐతే రెండేళ్లు తిరిగేలోపే ఇలియానా మళ్లీ ప్రెగ్నెంట్ అయిందని, రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని నెల కిందట మళ్లీ ప్రచారం మొదలైంది. నిన్నటిదాకా ఇది జస్ట్ రూమరే. కానీ ఇప్పుడు ఆ విషయం వాస్తవమే అని వెల్లడైంది. స్వయంగా ఇలియానా ఈ విషయాన్ని కన్ఫమ్ చేసింది. ఇలియానా లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్టు చూస్తే ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం నిజమే అని తెలుస్తుంది.
కుర్కురేతో పాటు ఆంటాసిడ్ చ్యూయింగ్ గమ్స్ ప్యాకెట్లు కనిపిస్తున్న ఫొటోను ఇలియానా షేర్ చేసింది. ఇవి రెండూ పుల్లగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ”మీరు ప్రెగ్నెంట్ అని చెప్పకుండా ప్రెగ్నెంట్ అని తెలియజేయండి” అనే క్యాప్షన్ సైతం ఇలియానా జోడించింది. దీంతో అసలు విషయం జనాలకు అర్థమైపోయింది. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నందుకు ఇలియానాకు శుభాకాంక్షలు అంటూ మెసేజ్లు వెల్లువెత్తాయి.
వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డాక ఇలియానా సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. బిడ్డకు జన్మనిచ్చాక అసలు లైమ్ లైట్లో లేదు. తన ఫ్యామిలీ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పెద్దగా పోస్ట్ చేయట్లేదు. చివరగా ఆమె తెలుగులో 2018లో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on February 15, 2025 9:01 pm
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…