ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్లి స్థిరపడ్డ కథానాయిక ఇలియానా. హిందీలో బర్ఫీ సహా కొన్ని మంచి సినిమాలు చేశాక ఆమె నెమ్మదిగా సినీ రంగానికి దూరమైంది. కొన్నేళ్ల కిందట ఆమె మైకేల్ డోలన్ అనే విదేశీయుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇలియానా గర్భవతి అయ్యేవరకు వీరి బంధం గురించి బయటి ప్రపంచానికి తెలియదు. బిడ్డను కన్నపుడే భర్త గురించి కూడా వెల్లడించింది.
2023లో ఈ జంట మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడి పేరు.. కోవా ఫోనిక్స్ డోలన్. ఐతే రెండేళ్లు తిరిగేలోపే ఇలియానా మళ్లీ ప్రెగ్నెంట్ అయిందని, రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని నెల కిందట మళ్లీ ప్రచారం మొదలైంది. నిన్నటిదాకా ఇది జస్ట్ రూమరే. కానీ ఇప్పుడు ఆ విషయం వాస్తవమే అని వెల్లడైంది. స్వయంగా ఇలియానా ఈ విషయాన్ని కన్ఫమ్ చేసింది. ఇలియానా లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్టు చూస్తే ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం నిజమే అని తెలుస్తుంది.
కుర్కురేతో పాటు ఆంటాసిడ్ చ్యూయింగ్ గమ్స్ ప్యాకెట్లు కనిపిస్తున్న ఫొటోను ఇలియానా షేర్ చేసింది. ఇవి రెండూ పుల్లగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ”మీరు ప్రెగ్నెంట్ అని చెప్పకుండా ప్రెగ్నెంట్ అని తెలియజేయండి” అనే క్యాప్షన్ సైతం ఇలియానా జోడించింది. దీంతో అసలు విషయం జనాలకు అర్థమైపోయింది. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నందుకు ఇలియానాకు శుభాకాంక్షలు అంటూ మెసేజ్లు వెల్లువెత్తాయి.
వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డాక ఇలియానా సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. బిడ్డకు జన్మనిచ్చాక అసలు లైమ్ లైట్లో లేదు. తన ఫ్యామిలీ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పెద్దగా పోస్ట్ చేయట్లేదు. చివరగా ఆమె తెలుగులో 2018లో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…