Movie News

మెగా కలయిక – విశ్వంభరలో విరూపాక్ష

మావయ్యలంటే విపరీతమైన ప్రాణం, అభిమానం చూపించే సాయి ధరమ్ తేజ్ వాళ్ళ పక్కన నటించే ఛాన్స్ కోసం కెరీర్ మొదలైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. అదృష్టం కొద్దీ బ్రోలో పవన్ కళ్యాణ్ తో సమానంగా స్క్రీన్ పంచుకునే అదృష్టం దక్కింది. ఫలితం సంగతి పక్కనపెడితే మళ్ళీ ఇలాంటి అవకాశం అంత సులభంగా దొరకదు.

రోజుల తరబడి ఇద్దరూ సెట్స్ మీద ఉండటం, స్క్రీన్ మీద చూసుకుని మురిసిపోవడం ఎప్పటికీ అలా గుర్తు ఉండిపోతుంది. ఇప్పుడు పెద్ద మావయ్యతో కూడా ఆ ఛాన్స్ కొట్టేసినట్టు లేటెస్ట్ అప్డేట్. విశ్వంభరలో ఈ కలయిక చిన్న శాంపిల్ గా చూడొచ్చని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఇంట్రో సాంగ్ షూట్ జరుగుతోంది. అందులోనే సాయి తేజ్ ఎంట్రీ ఉండొచ్చట. చిన్న బిట్ అయినా అది స్పెషలే అవుతుంది. చిరుతో ఇలా కాంబోలు పంచుకోవడం మెగా హీరోలు గతంలో చేసిందే. శంకర్ దాదా ఎంబిబిఎస్ పాటలో ఒకేసారి, శంకర్ దాదా జిందాబాద్ ఫైట్ లో మరోసారి పవన్ కళ్యాణ్ అన్నయ్యతో కలిసి నటించాడు.

ఇదే సినిమా సాంగ్ లో అల్లు అర్జున్ అలా తళుక్కున మెరిసి మావయ్యకు ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. చిరు, నాగబాబులు ఎనభై దశకంలోనే జంటగా కనిపించారు. చరణ్ – చిరు ఖైదీ నెంబర్ 150, ఆచార్య, మగధీర, బ్రూస్ లీలో కలిసి అలరించారు.

ఇదే విశ్వంభరలో నీహారిక కూడా ఉంటుందట. సైరాలో కనిపించి కనిపించకుండా మాయమైన సంగతి తెలిసిందే. చివరి దశలో ఉన్న విశ్వంభర ఇంకా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. మే 9 లేదా జూన్ 27 రెండు ఆప్షన్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఫైనల్ కాపీ సిద్ధమవుతున్న టైంలో నిర్ణయం తీసుకుందామని అనుకున్నట్టు ఇన్ సైడ్ టాక్.

ప్రస్తుతం షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో సిస్టర్, చైల్డ్ సెంటిమెంట్ తో పాటు బోలెడు యాక్షన్ పార్ట్ ఉంటుంది. ఆస్కార్ విజేత కీరవాణి అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయట.

This post was last modified on February 15, 2025 6:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

15 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago