Movie News

శ్రీవల్లి అభిమానులు… ఎక్కువ ఊహించుకోవద్దు!

యానిమల్, పుష్ప 2 ది రూల్ రెండు ఇండస్ట్రీ హిట్లతో ఊపుమీదున్న రష్మిక మందన్న హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకంతో చావా మీద బోలెడు ఆశలు పెట్టుకుంది. ప్రమోషన్ల కోసం కాలు బాలేకపోయినా వీల్ చైర్ వేసుకుని హైదరాబాద్ నుంచి ముంబైకి ట్రిప్పులు కొట్టింది.

బాగైన తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చి, ఈవెంట్లకు వెళ్లి తనవరకు ఎంత చేయాలో అంతా చేసింది. దానికి తగ్గట్టే చావాకు సూపర్ హిట్ టాక్ నడుస్తోంది. యునానిమస్ గా కాకపోయినా అధిక శాతం విమర్శకులు కంటెంట్ మెచ్చుకుంటున్నారు. విక్కీ కౌశల్ నటనను కొనియాడుతున్నారు. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం గురించి కితాబు ఇస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఎటొచ్చి రష్మికకు ప్రశంసలు దక్కడం లేదు. కారణం ఆమె పోషించిన రాణి యేసుబాయ్ కి కథ పరంగా తక్కువ స్కోప్ దొరకడం. అందులోనూ స్వంత డబ్బింగ్ చెప్పుకోవడంతో మరాఠా యాస కనిపించాల్సిన హిందీ డైలాగుల్లో సౌత్ ఫ్లేవర్ వినిపించింది. దీంతో ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు.

నిజానికి యేసుబాయ్ గొప్పదనం చిన్నది కాదు. శంభాజిని ఔరంగజేబు ఎత్తుకుపోతే చిన్న వయసులో ఉన్న కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టి మొత్తం రాజతంత్రం ఆవిడే చూసుకుంటుంది. అదంతా చావాలో చూపించలేదు. అసలామెని వీరమహిళగా ప్రొజెక్ట్ చేయడంలో లక్ష్మణ్ ఆసక్తి చూపించలేదు.

దీంతో రష్మికకు పెద్దగా పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం లేకపోయింది. స్క్రీన్ మొత్తం విక్కీ కౌశల్, రక్తం నిండిపోతే ఇక తనైనా చేయడానికి ఏముంటుంది. అందుకే ఈ సినిమాని చూసేందుకు ఆమె ఫ్యాన్స్ ఒక ఆప్షన్ గా పెట్టుకుంటే మాత్రం ఎక్కువ ఊహించుకోకపోవడం బెటర్. రన్బీర్ కపూర్, అల్లు అర్జున్ కాంబోలో మంచి పవర్ ఫుల్ సీన్లు చేసిన రష్మికకు చావాలో మాత్రం ఆ ఛాన్స్ దొరకలేదు.

గతంలో ఇదే శంభాజీ మీద వచ్చిన ఇతర మరాఠి సినిమాల్లో యేసుబాయ్ ని హైలైట్ చేయడం కొసమెరుపు. ఏది ఏమైనా కోరుకున్న హిట్టయితే వచ్చేసింది కాబట్టి శ్రీవల్లి ఖాతాలో పెద్ద హ్యాట్రిక్ నమోదు కావడం ఖాయమే.

This post was last modified on February 15, 2025 12:01 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

1 hour ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

3 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

5 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago