ఈ ఇంటర్నెట్ జమానాలో ఎవరెందుకు ఫేమస్ అవుతారనేది ఎవరికీ తెలీదు. ఏ పాటకు అయినా పిచ్చి డాన్సులు చేసి తమ పిచ్చి చేష్టలతోనే పాపులర్ కావాలని చూసే వాళ్లను జనం పాపులర్ చేసేస్తుంటారు. టీజర్లో కన్ను కొట్టిన పిల్లను జాతీయ వ్యాప్తంగా ట్రెండ్ చేసేసి సెలబ్రిటీలతో కూడా ట్వీట్లు పెట్టించేస్తారు.
తాజాగా క్రికెట్ మ్యాచ్ చూస్తూ టెన్షన్లో గోళ్లు కొరుకుతూ కనిపించిన ఒక సుందరి ఓవర్ నైట్ సెలబ్రిటీ అయింది. ముంబయి వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన రెండు సూపర్ ఓవర్ల మ్యాచ్ గుర్తుంది కదా. ఆ మ్యాచ్లో గ్యాలరీలో కూర్చుని గోళ్లు కొరుకుతూ కనిపించిన సుందరి పేరు రియానా లాల్వాణి. అసలే ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తోన్న పోటీలు కనుక వున్న ఆ కొందరిలో రియానానే కెమెరాలు అధికంగా కవర్ చేసాయి. దీంతో ఆమె ‘సూపర్ ఓవర్ గాళ్’గా పేరు తెచ్చుకుంది.
ఒక్క రోజులో ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంట్ వేలకి వేలు దాటేసింది. తన బయో చూసిన వాళ్లకు క్లారిటీ ఇస్తూ ఆమె ‘సూపర్ ఓవర్ గాళ్’ అని ఎడిట్ చేసింది. ఈ పాపులారిటీతో త్వరలో ఆమెకు బాలీవుడ్ సినిమాలో ఆఫర్ వచ్చినా ఆశ్చర్యం లేదు. మామూలుగా అయితే ఇదో పెద్ద న్యూస్ అవ్వాలి. కానీ ఈ టిక్టాక్ యుగంలో ఎవరైనా సెలబ్రిటీ అయిపోవచ్చులెండి.
This post was last modified on October 21, 2020 11:05 pm
టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పార్టీ సీనియర్లకు.. పరోక్షంగా ఓ విషయాన్ని తేల్చి చెప్పేశారు. కూటమి విషయంలోనూ.. ముఖ్యంగా జనసేన-టీడీపీ…
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…