సినీ, టీవీ పరిశ్రమలను కరోనా వదలట్లేదు. వైరస్ ప్రభావం గతంతో పోలిస్తే తగ్గి, దాని గురించి జనాలు భయపడటం తగ్గించేసినా.. పూర్తిగా విస్మరించే పరిస్థితి అయితే లేదు. ఇటీవలే చాలా ఉత్సాహంగా షూటింగ్ పున:ప్రారంభించుకున్న ‘టక్ జగదీష్’ టీం.. యూనిట్లో ఒకరికి కరోనా సోకడంతో వెంటనే ప్యాకప్ చెప్పేయడం, అందరూ క్వారంటైన్ అయిపోవడం తెలిసిన సంగతే.
టీవీ రంగంలో కూడా ఇలాంటి పరిణామాలే చాలా జరిగాయి. తాజాగా కరోనా ప్రభావం ఈటీవీలో ప్రసారమయ్యే ఫేమస్ షోలు జబర్దస్త్, ఢీలపై పడింది. ఈ కార్యక్రమాల్లో కీలక వ్యక్తి అయిన సుడిగాలి సుధీర్కు కరోనా సోకినట్లు వెల్లడైంది. రెండు రోజులుగా కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో అతను వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్గా తేలింది. దీంతో జబర్దస్త్, ఢీ ప్రోగ్రాంల నిర్వాహకులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు.
‘ఎక్స్ట్రా జబర్దస్త్’లో సుధీర్తో కలిసి స్కిట్లు చేసే రామ్ ప్రసాద్, సన్నీ తదితరులకు కూడా పరీక్షలు నిర్వహించారు. అలాగే ‘ఢీ’ ప్రోగ్రాంలో సుధీర్తో సన్నిహితంగా ఉన్న వాళ్లకూ పరీక్షలు జరిపారు. ఎవరికీ పాజిటివ్ లేదనే అంటున్నారు. ఐతే కొన్ని రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు చేయించబోతున్నారు. సుధీర్కైతే తీవ్ర లక్షణాలేమీ లేకపోవడంతో అతను హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయాడు.
రెండు మూడు వారాలు అతను జబర్దస్త్, ఢీ షోల్లో కనిపించే అవకాశం లేనట్లే. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’లో మొత్తంగా అతడి టీం స్కిట్లే ఆగిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ‘జబర్దస్త్’లో పూర్తిగా హైపర్ ఆది టీం హవా నడిస్తే.. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’లో సుధీర్ టీం స్కిట్లే హైలైట్ అవుతుంటాయి. ఆ షోలో వాళ్లదే టాప్ ప్లేస్ అని చెప్పొచ్చు. మరి కొన్ని వారాలు ఈ టీం స్కిట్లు ఆగిపోతే షోకు ఆదరణ తగ్గిపోవడం ఖాయం.
This post was last modified on October 21, 2020 7:05 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…