తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో చివరగా బ్లాక్ బస్టర్ కొట్టాడు అజిత్. ఆ తర్వాత ఆయన్నుంచి వచ్చిన నీర్కొండ పార్వై, వలిమై, తునివు ఓ మోస్తరుగా ఆడాయి. అజిత్ స్టార్ పవర్ వల్ల వీటికి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. ఆ తర్వాత బలంగా నిలబడలేకపోయాయి. ఇక లేటెస్ట్గా రిలీజైన అజిత్ సినిమా ‘విడాముయర్చి’.. ఆయన కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
ముందు అనుకున్నట్లు సంక్రాంతి టైంలో వస్తే సినిమా బెటర్గా పెర్ఫామ్ చేసేదేమో కానీ.. అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో రిలీజై, బ్యాడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అనిపించుకుంది. తెలుగులో అయితే ఈ సినిమా పూర్తిగా వాషౌట్ అయిపోయింది. డిజాస్టర్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయిన లైకా ప్రొడక్షన్స్ను ఈ సినిమా ఇంకా పెద్ద దెబ్బ కొట్టింది. సినిమా మీద పెట్టిన పెట్టుబడి వెనక్కి రాకపోగా.. హాలీవుడ్ మూవీ ‘బ్రేక్ డౌన్’ను ఫ్రీమేక్ చేసినందుకు వారికి చెల్లించిన డబ్బులు అదనపు భారం అయ్యాయి.
లైకా సంగతి పక్కన పెడితే.. కొన్నేళ్ల ముందు వరకు స్టార్ పవర్లో విజయ్కి దీటుగా నిలిచిన అజిత్.. ఇప్పుడు తన ముందు వెలవెలబోయే పరిస్థితి. విజయ్ సినిమాల నుంచి నిష్క్రమించబోతున్న తరుణంలో నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి తాను అర్హుడినని అజిత్ చాటాల్సి ఉంది. అతడికి పెద్ద హిట్ ఇచ్చే బాధ్యత తెలుగు వారి మీదే ఉండడం గమనార్హం.
అజిత్ కొత్త చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని ప్రొడ్యూస్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యెర్నేని. ఇప్పటికే మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన మైత్రీ అధినేతలు.. ఈ మూవీతో తమిళంలో అడుగు పెడుతున్నారు. ‘విడాముయర్చి’ డిజాస్టర్ అయినా.. ఆ ప్రభావం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మీద పడనట్లే కనిపిస్తోంది. సినిమాకు మంచి హైప్ ఉంది. అజిత్కు వీరాభిమాని అయిన ఆధిక్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
అతను చివరగా ‘మార్క్ ఆంటోనీ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అజిత్ను అభిమానులు చూడాలని కోరుకునే మాస్ పాత్రను చేస్తున్నాడిందులో. సినిమా కూడా ఊర మాస్గా ఉండబోతోంది. ‘విడాముయర్చి’ని చేదు జ్ఞాపకాలను చెరిపివేసేలా బ్లాక్ బస్టర్ అవుతుందని ఈ చిత్రంపై అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. ఏప్రిల్ 10న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on February 12, 2025 12:57 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…