ఇప్పుడు సినిమాల్లో క్వాలిటీ కంటెంట్, భారీతనం, బిజినెస్, కలెక్షన్స్.. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్ మీద సౌత్ సినిమానే స్పష్టమైన ఆధిక్యం సాధిస్తున్న మాట వాస్తవం. ఒకప్పుడు బాలీవుడ్ ముందు చిన్నవిగా కనిపించిన సౌత్ ఫిలిం ఇండస్ట్రీస్ దాన్ని దాటి ముందుకు వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా రేంజే మారిపోయింది.
ఐతే వెబ్ సిరీస్ల విషయానికి వస్తే మాత్రం బాలీవుడ్దే ఆధిపత్యం అనడంలో సందేహం లేదు. ఫ్యామిలీ మ్యాన్ సహా ఎన్నో టాప్ వెబ్ సిరీస్లు వచ్చాయి బాలీవుడ్ నుంచి. సౌత్ ఇండస్ట్రీ వెబ్ కంటెంట్ మీద పెద్దగా దృష్టిసారించకపోవడంతో ఇంకా అందులో కంటెంట్ స్థాయి పెరగట్లేదు. కానీ కొన్ని ఒరిజినల్స్ మాత్రం బాలీవుడ్కు దీటుగా నిలిచాయి. విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు ప్రేక్షకాదరణనూ దక్కించుకున్నాయి.
అలాంటి సిరీస్ల్లో ముందు వరుసలో నిలుస్తుంది.. సుడల్. ‘విక్రమ్ వేద’ దర్శకులు పుష్కర్-గాయత్రి అమేజాన్ కోసం క్రియేట్ చేసిన సిరీస్ ఇది. 2022లో రిలీజైన ఈ తమిళ సిరీస్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. కంటెంట్ పరంగా సౌత్ నుంచి వచ్చిన బెస్ట్ సిరీస్ ఇదని చెప్పొచ్చు. ఇండియాలో మోస్ట్ వ్యూడ్ ఒరిజినల్స్లోనూ ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ సిరీస్కు రెండో సీజన్ రెడీ అయింది.
ఈ నెల 28 నుంచి ఇది ప్రైమ్లో స్ట్రీమ్ కానుంది. పుష్కర్-గాయత్రిలే దీన్నీ క్రియేట్ చేశారు. తొలి సీజన్లో ముఖ్య పాత్రలు పోషించిన ఐశ్వర్యా రాజేష్-కదిర్ ఇందులోనూ లీడ్ రోల్స్ చేశారు. శ్రియా రెడ్డి కూడా ఇందులో కొనసాగనుంది. షాకింగ్ ట్విస్టులు, ఉత్కంఠభరిత కథనంతో తొలి సీజన్ ఉర్రూతలూగించగా.. రెండో సీజన్ కూడా అలాగే ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.
This post was last modified on February 11, 2025 5:19 pm
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…