ఎవరికైనా హీరోల మీద అభిమానం ఉంటే ఏం చేస్తాం. పోస్టర్లు దాచుకుంటాం. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంజాయ్ చేస్తాం. బ్యానర్లు కడతాం. పదే పదే సినిమాలు చూసుకుని మురిసిపోతాం. వాళ్ళేదైనా పిలుపు ఇస్తే సామజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాం. రాజకీయాల్లోకి వస్తే ఓటు వేసి జై కొడతాం. ఇంతేకదా.
కానీ ముంబైకి చెందిన నిషా పాటిల్ ముందు ఎవరైనా దిగదుడుపే అనాలి. ఆవిడకు సంజయ్ దత్ అంటే పిచ్చి అభిమానం. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఆరాధిస్తూ పెరిగింది. నామ్ నుంచి ఖల్ నాయక్ దాకా, సంజు నుంచి కెజిఎఫ్ 2 దాకా ప్రతి చిత్రాన్ని కొన్ని వందల సార్లు చూసింది. లెక్కలేనంత డబ్బు టికెట్లకే పెట్టింది.
ఇటీవలే నిషా పాటిల్ కన్నుమూశారు. ఆవిడ వయసు 62 సంవత్సరాలు. కన్నుమూసే నాటి సుమారు 72 కోట్ల రూపాయల ఆస్తి నిషా పేరిట ఉంది. అదంతా సంజయ్ దత్ కు రాసేసి వెళ్లిపోవడం కుటుంబ సభ్యులను షాక్ కి గురి చేసింది.
తన చివరి రోజులను ముందే గుర్తించిన నిషా పాటిల్ సదరు డాక్యుమెంట్లను 2018లోనే లీగల్ గా రాయించి, బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బుని సంజయ్ దత్ కి అందజేయాలని లెటర్లు రాసి పక్కాగా బదలాయింపు చేసింది. ఇంటికి దస్తావేజులు వచ్చాక కానీ సంజు బాబాకి మ్యాటర్ అర్థం కాలేదు. అసలు పరిచయమే లేని ఒక అపరిచితురాలు ఆస్తి రాసివ్వడం చూసి నివ్వెరపోయారు.
విషాదం ఏంటంటే నిషా పాటిల్ ఇప్పటిదాకా సంజయ్ దత్ ని ప్రత్యక్షంగా కలవనేలేదు. కానీ తన హీరో మీద ప్రేమతో కోట్ల రూపాయలు కానుకగా ఇచ్చింది. అలాని సంజయ్ దత్ వాటిని స్వీకరించలేదు. త్వరలోనే వాళ్ళ ఫ్యామిలీకే అవి తిరిగి చెందేలా తన లీగల్ టీమ్ ని పురమాయించారు.
ఇంత వీరాభిమానిని కలుసుకోలేకపోవడం కలవపరిచిందని, కనీసం కుటుంబ సభ్యులనైనా కలిసి కొంత ఊరట చెందుతానని పేర్కొన్నారు. అయినా ఎందరెందరో కరుడు గట్టిన ఫ్యాన్స్ ని నిత్యం చూస్తుంటాం కానీ నిషా పాటిల్ మాత్రం అందరికన్నా టాపని చెప్పాలి. ఆస్తుల కోసం హత్యలు చేస్తున్న సమాజంలో ఆవిడ చూపించింది అభిమానానికి మించి.
This post was last modified on February 11, 2025 12:05 pm
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…