Movie News

72 కోట్ల ఆస్తి… స్టార్ హీరోకు రాసిచ్చి వెళ్ళిపోయింది

ఎవరికైనా హీరోల మీద అభిమానం ఉంటే ఏం చేస్తాం. పోస్టర్లు దాచుకుంటాం. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంజాయ్ చేస్తాం. బ్యానర్లు కడతాం. పదే పదే సినిమాలు చూసుకుని మురిసిపోతాం. వాళ్ళేదైనా పిలుపు ఇస్తే సామజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాం. రాజకీయాల్లోకి వస్తే ఓటు వేసి జై కొడతాం. ఇంతేకదా.

కానీ ముంబైకి చెందిన నిషా పాటిల్ ముందు ఎవరైనా దిగదుడుపే అనాలి. ఆవిడకు సంజయ్ దత్ అంటే పిచ్చి అభిమానం. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఆరాధిస్తూ పెరిగింది. నామ్ నుంచి ఖల్ నాయక్ దాకా, సంజు నుంచి కెజిఎఫ్ 2 దాకా ప్రతి చిత్రాన్ని కొన్ని వందల సార్లు చూసింది. లెక్కలేనంత డబ్బు టికెట్లకే పెట్టింది.

ఇటీవలే నిషా పాటిల్ కన్నుమూశారు. ఆవిడ వయసు 62 సంవత్సరాలు. కన్నుమూసే నాటి సుమారు 72 కోట్ల రూపాయల ఆస్తి నిషా పేరిట ఉంది. అదంతా సంజయ్ దత్ కు రాసేసి వెళ్లిపోవడం కుటుంబ సభ్యులను షాక్ కి గురి చేసింది.

తన చివరి రోజులను ముందే గుర్తించిన నిషా పాటిల్ సదరు డాక్యుమెంట్లను 2018లోనే లీగల్ గా రాయించి, బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బుని సంజయ్ దత్ కి అందజేయాలని లెటర్లు రాసి పక్కాగా బదలాయింపు చేసింది. ఇంటికి దస్తావేజులు వచ్చాక కానీ సంజు బాబాకి మ్యాటర్ అర్థం కాలేదు. అసలు పరిచయమే లేని ఒక అపరిచితురాలు ఆస్తి రాసివ్వడం చూసి నివ్వెరపోయారు.

విషాదం ఏంటంటే నిషా పాటిల్ ఇప్పటిదాకా సంజయ్ దత్ ని ప్రత్యక్షంగా కలవనేలేదు. కానీ తన హీరో మీద ప్రేమతో కోట్ల రూపాయలు కానుకగా ఇచ్చింది. అలాని సంజయ్ దత్ వాటిని స్వీకరించలేదు. త్వరలోనే వాళ్ళ ఫ్యామిలీకే అవి తిరిగి చెందేలా తన లీగల్ టీమ్ ని పురమాయించారు.

ఇంత వీరాభిమానిని కలుసుకోలేకపోవడం కలవపరిచిందని, కనీసం కుటుంబ సభ్యులనైనా కలిసి కొంత ఊరట చెందుతానని పేర్కొన్నారు. అయినా ఎందరెందరో కరుడు గట్టిన ఫ్యాన్స్ ని నిత్యం చూస్తుంటాం కానీ నిషా పాటిల్ మాత్రం అందరికన్నా టాపని చెప్పాలి. ఆస్తుల కోసం హత్యలు చేస్తున్న సమాజంలో ఆవిడ చూపించింది అభిమానానికి మించి.

This post was last modified on February 11, 2025 12:05 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

2 minutes ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

24 minutes ago

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

2 hours ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

2 hours ago

ధైర్యం అనుమానం మధ్య ‘పెద్ది’ సందిగ్ధం

రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…

2 hours ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

4 hours ago