ఒకప్పుడు శాటిలైట్ ఛానల్స్ లో కొత్త సినిమాల ప్రీమియర్లకు విపరీతమైన ఆదరణ ఉండేది. ఆ సమయానికి పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటిల్లిపాది టీవీ సెట్ల ముందు తిష్ట వేసుకుని కూర్చునేవారు. దానికి తగ్గట్టే టిఆర్పి రేటింగ్స్ తో ఆదాయం భారీగా సమకూరేది. నిర్మాతలకు హక్కుల రూపంలో సొమ్ములు బాగా అందేవి.
ఓటిటిలు వచ్చాక సీన్ మారిపోయింది. శాటిలైట్ కన్నా ముందు తమ యాప్స్ లో స్ట్రీమింగ్ జరగాలనే కండీషన్ తో ప్రొడ్యూసర్లకు వల వేసి హక్కుల రూపంలో ప్రొడ్యూసర్లకు కనక వర్షం కురిపించడం మొదలయ్యింది. దీంతో టీవీ టెలికాస్ట్ కు ప్రాధాన్యం తగ్గిపోయి అందరూ ఓటిటిలకు షిఫ్ట్ అయిపోయారు.
తాజాగా సంక్రాంతికి వస్తున్నాం ఈ ట్రెండ్ మార్చేందుకు శ్రీకారం చుడుతోంది. ఈ సినిమా శాటిలైట్, ఓటిటి హక్కులను జీ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రయోగాత్మకంగా దీన్ని ముందు తమ జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేయబోతున్నారు. ఆ తర్వాత జీ5 లో పెట్టేస్తారు.
చాలా సంవత్సరాల తర్వాత ఇలా జరగడం విశేషం. మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ రీజనల్ ఇండస్ట్రీ హిట్ ని బుల్లితెరపై చూసేందుకు జనాలు ఎగబడతారని చెప్పడం సందేహం అక్కర్లేదు. థియేటర్లకే అంతగా పోటెత్తినప్పుడు టీవీలో వచ్చినప్పుడు ఇంట్లో చూడకుండా ఊరికే వదులుతారా. రచ్చ రచ్చ చేస్తారు.
ఇది బాగానే ఉంది కానీ అన్ని సినిమాలకు ఇలా జరిగే అవకాశం తక్కువే. ఎందుకంటే అధిక శాతం ఓటిటిలకు స్వంతంగా టెలికాస్ట్ ఛానల్స్ లేవు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ స్వతంత్రంగా వ్యాపారం చేసే డిజిటల్ కంపెనీలు. కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఎన్ని ఈ బాటలో వెళ్తాయనేది చెప్పలేం.
రెండు హక్కులను గంపగుత్తగా ఒకరికే ఇచ్చినప్పుడు ఇది సాధ్యమవుతుంది. పాతిక రోజులు పూర్తి చేసుకుని ఇప్పటికీ డీసెంట్ హోల్డ్ తో కొనసాగుతున్న ఈ బ్లాక్ బస్టర్ ఎప్పుడు ప్రసారమవుతుందనేది ఇంకా చెప్పలేదు కానీ ఫిబ్రవరి మూడో వారం లేదా శివరాత్రి పండక్కు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
This post was last modified on February 10, 2025 3:21 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…