Movie News

ఇండస్ట్రీ లో కాంపౌండ్ లపై చిరు కామెంట్!,

‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఐక్యతపై, ఫ్యాన్ వార్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, మొదటిసారిగా పుష్ప-2 చిత్రం గురించి చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప-2 పెద్ద హిట్టయిందని, బ్లాక్ బస్టర్ అయిందని, అందుకు తాను గర్విస్తున్నానని చిరు అన్నారు. బాలకృష్ణ కాంపౌండ్..మెగా కాంపౌండ్..అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు విష్వక్సేన్ భలే సమాధానం చెప్పాడని చిరు అన్నారు.

ఫిలిం ఇండస్ట్రీకి కాంపౌడ్ లేదని చెప్పిన విశ్వక్ సేన్ ను అభినందిస్తున్నానని చెప్పారు. మనుషులన్నాక వేరే వాళ్లపై అభిమానం, ప్రేమ ఉంటాయని, రామ్ చరణ్ కు సూర్య అంటే చాలా ఇష్టం అని, అంతమాత్రాన చెర్రీ ఫంక్షన్ కు తాను వెళ్లకూడదా అని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో హీరోలు గిరిగీసుకుని ఉన్న రోజులు గతంలో ఉన్నాయని, కానీ, అది షూటింగుల వరకేనని చెప్పారు.

అయితే, అది తెలియక అభిమానులు కొట్టుకుచచ్చేవాళ్లని గుర్తు చేసుకున్నారు. మద్రాస్ లో గతంలో హనీ హౌస్ ఉండేదని, తెలుగు, తమిళ ఇండస్ట్రీ వారు అక్కడ పార్టీలు, ఫంక్షన్ లు చేసుకునేవారని చెప్పారు. నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణలతో తాను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటానని, నాగార్జున, తాను తరచుగా కలుస్తుంటామని అన్నారు.

విశ్వక్ పై ఒక ముద్ర వేసి, అతడి ఫంక్షన్లకు వెళ్లకూడదని అనుకోవడం సరికాదని అన్నారు. అతడు ఇండస్ట్రీలో, మన కుటుంబంలో ఒకడు అని సందేశాన్ని అందించాలని చెప్పారు. ఓ నిర్మాత తనకు ఇస్తున్న అడ్వాన్స్ మరో హీరోతో తీసిన సినిమా ద్వారా వచ్చినవే కదా అని గుర్తు చేశారు. ఇండస్ట్రీలో అందరూ అవినాభావ సంబంధంతో ఉండాలని, అప్పుడే మంచి వాతావరణం ఉంటుందని చెప్పారు.

This post was last modified on February 10, 2025 12:36 am

Share
Show comments
Published by
Kumar
Tags: Chiranjeevi

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

1 hour ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

1 hour ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

10 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago