జూన్ ఒకటి నుంచి మల్లువుడ్ బంద్ కాబోతోంది. కేరళ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ మేరకు సంయుక్త నిర్ణయం తీసుకున్నారు. షూటింగులు ఆపేస్తూ తమ డిమాండ్లు నెరవేరేవరకు అన్నీ ఆపేస్తున్నారు. తమ సమస్యలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇంత కన్నా మార్గం లేదని వాపోతున్నారు.
సినిమా బడ్జెట్ లో 60 శాతం ఆర్టిస్టుల రెమ్యునరేషన్లకు వెళ్ళిపోయి, 30 శాతం పన్ను కడుతూ అందులో మళ్ళీ అదనంగా ఎంటర్ టైన్మెంట్ టాక్స్ పేరుతో ఎక్కువ బాదుడుకు గురవుతున్నది తమ పరిశ్రమే అని చెబుతూ ఈ సమాఖ్య తరఫున హీరోయిన్ కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ పై విషయాలను వెల్లడించారు.
ఇప్పుడిది ఇతర భాషల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది. మొత్తం ఆపేసినంత మాత్రాన హీరో హీరోయిన్లు దిగొచ్చి పారితోషికాలు తగ్గించుకుంటారా అంటే అనుమానమే. ప్రొడ్యూసర్ డిమాండ్ చేస్తున్నట్టు పన్ను తగ్గింపు చర్యలు అంత సులభంగా జరిగే పని కాదు.
జనవరి నెలలో కేవలం మలయాళం సినిమాల నుంచే వంద కోట్లకు పైగా నష్టం వచ్చిందనేది ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాట. యాభై రోజుల్లో తీయాల్సిన సినిమాను నూటా యాభై రోజులకు పొడిగిస్తున్న దర్శకుల ధోరణిని కూడా వీళ్ళు ఎండగడుతున్నారు. ఇతర భాషల పరిశ్రమల్లోనూ ఈ తరహా విప్లవం తెచ్చేందుకు మద్దతు కోరబోతున్నారని టాక్.
ఇవన్నీ ఎలా ఉంన్నా ముందైతే మార్పు రావాల్సింది నిర్మాతల్లోనే. ఒక హీరోకు హిట్టు పడగానే రెమ్యూనరేషన్లు అమాంతం పెంచేసి వాళ్ళ వెంట పడినప్పుడు సహజంగానే డిమాండ్ కు తగ్గట్టు మార్కెట్ ని క్యాష్ చేసుకోవాలని అందరూ అనుకుంటారు. వాళ్ళ గొంతెమ్మ కోరికలను మహాభాగ్యంగా భావించడం వల్లే కదా ఇవాళ చిన్న ఆర్టిస్టులు సైతం క్యారవాన్లు అడుగుతున్నారు.
నిర్మాణ వ్యయం కూడా అంతే. అదుపు తప్పుతున్నది కేవలం డైరెక్టర్ల వల్లే కాదు. అందులో అందరి బాధ్యత ఉంది. గత ఏడాది ఒక్క మల్లువుడ్ లోనే 176 సినిమాలు ఫ్లాపై నష్టాలు తెచ్చాయి. ఇప్పుడీ పరిణామాలకు ప్రధాన కారణం ఇదే.
This post was last modified on February 9, 2025 12:36 pm
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…