ఒకప్పుడు కొత్త సినిమా రిలీజైన కొన్ని రోజులకు పైరసీ సీడీలు బయటికి వచ్చేవి. థియేటర్లలో స్క్రీన్ను రికార్డ్ చేసిన ఆ వీడియోల్లో క్లారిటీ ఉండేది కాదు. అయినా కొందరు వాటినే చూసేవాళ్లు. తర్వాతి రోజుల్లో పైరసీ రూపం మార్చుకుంటూ వస్తోంది. ఓటీటీల్లో సినిమాలు రిలీజయ్యాక వాటిని రికార్డ్ చేసి క్లారిటీ ప్రింట్లను అందుబాటులోకి తెస్తున్నారు.
అంతకంటే ముందు వచ్చే వచ్చే పైరసీ ప్రింట్లు పెద్దగా క్లారిటీ ఉండకపోవడంతో పైరసీ చూసే వాళ్లు తక్కువగానే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతోంది. రిలీజ్ రోజు క్లారిటీ విజువల్స్, ఆడియోతో పైరసీ ప్రింట్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. రిలీజ్ రోజు హెచ్డీ ప్రింట్లు బయటికి రావడం ఇన్నాళ్లూ కోలీవుడ్లోనే చూసేవాళ్లం.
మూవీ రూల్జ్ లాంటి వెబ్ సైట్లు ఎలా చేస్తాయో ఏమో కానీ.. కొత్త చిత్రాలను రిలీజ్ రోజే మంచి క్లారిటీతో ఆన్ లైన్లోకి తెచ్చేస్తూ కోలీవుడ్ను చాలా ఏళ్ల నుంచి వేధించుకు తింటున్నాయి. ఐతే ఇప్పుడు టాలీవుడ్కు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. క్రేజీ తెలుగు చిత్రాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లు ఒకట్రెండు రోజుల్లోనే ఆన్ లైన్లోకి వచ్చేస్తున్నాయి. సంక్రాంతి సినిమాలు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల విషయంలో ఇదే జరిగింది.
ఫుల్ క్లారిటీతో సినిమాలు ఆన్ లైన్లోకి రావడం వాటికి చేటు చేసింది. ఇప్పుడు ‘తండేల్’ కూడా పైరసీ బారిన పడింది. ఈ సినిమా నిన్ననే రిలీజైన సంగతి తెలిసిందే. సినిమాకు మంచి టాక్ వచ్చిందని, వసూళ్లు కూడా బాగున్నాయని టీం అంతా సంబరాల్లో ఉండగా.. రాత్రికే వారి మీద పైరసీ బాంబు పడింది. మంచి క్లారిటీ విజువల్స్, సౌండుతో హెచ్డీ వెర్షన్ను ఆన్ లైన్లోకి వదిలేశారు.
విడుదలై ఒక్క రోజైనా గడవకముందే హెచ్డీ ప్రింట్లు ఆన్ లైన్లోకి వచ్చేస్తే ఎంతో కష్టపడి, ఖర్చు పెట్టి సినిమా తీసిన మేకర్స్ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పైరసీని అరికట్టే విషయంలో కఠిన చర్యలు చేపట్టకపోతే మున్ముందు ఇండస్ట్రీ మనుగడకే ప్రమాదం వస్తుందని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…