ఒకప్పుడు కొత్త సినిమా రిలీజైన కొన్ని రోజులకు పైరసీ సీడీలు బయటికి వచ్చేవి. థియేటర్లలో స్క్రీన్ను రికార్డ్ చేసిన ఆ వీడియోల్లో క్లారిటీ ఉండేది కాదు. అయినా కొందరు వాటినే చూసేవాళ్లు. తర్వాతి రోజుల్లో పైరసీ రూపం మార్చుకుంటూ వస్తోంది. ఓటీటీల్లో సినిమాలు రిలీజయ్యాక వాటిని రికార్డ్ చేసి క్లారిటీ ప్రింట్లను అందుబాటులోకి తెస్తున్నారు.
అంతకంటే ముందు వచ్చే వచ్చే పైరసీ ప్రింట్లు పెద్దగా క్లారిటీ ఉండకపోవడంతో పైరసీ చూసే వాళ్లు తక్కువగానే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతోంది. రిలీజ్ రోజు క్లారిటీ విజువల్స్, ఆడియోతో పైరసీ ప్రింట్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. రిలీజ్ రోజు హెచ్డీ ప్రింట్లు బయటికి రావడం ఇన్నాళ్లూ కోలీవుడ్లోనే చూసేవాళ్లం.
మూవీ రూల్జ్ లాంటి వెబ్ సైట్లు ఎలా చేస్తాయో ఏమో కానీ.. కొత్త చిత్రాలను రిలీజ్ రోజే మంచి క్లారిటీతో ఆన్ లైన్లోకి తెచ్చేస్తూ కోలీవుడ్ను చాలా ఏళ్ల నుంచి వేధించుకు తింటున్నాయి. ఐతే ఇప్పుడు టాలీవుడ్కు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. క్రేజీ తెలుగు చిత్రాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లు ఒకట్రెండు రోజుల్లోనే ఆన్ లైన్లోకి వచ్చేస్తున్నాయి. సంక్రాంతి సినిమాలు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల విషయంలో ఇదే జరిగింది.
ఫుల్ క్లారిటీతో సినిమాలు ఆన్ లైన్లోకి రావడం వాటికి చేటు చేసింది. ఇప్పుడు ‘తండేల్’ కూడా పైరసీ బారిన పడింది. ఈ సినిమా నిన్ననే రిలీజైన సంగతి తెలిసిందే. సినిమాకు మంచి టాక్ వచ్చిందని, వసూళ్లు కూడా బాగున్నాయని టీం అంతా సంబరాల్లో ఉండగా.. రాత్రికే వారి మీద పైరసీ బాంబు పడింది. మంచి క్లారిటీ విజువల్స్, సౌండుతో హెచ్డీ వెర్షన్ను ఆన్ లైన్లోకి వదిలేశారు.
విడుదలై ఒక్క రోజైనా గడవకముందే హెచ్డీ ప్రింట్లు ఆన్ లైన్లోకి వచ్చేస్తే ఎంతో కష్టపడి, ఖర్చు పెట్టి సినిమా తీసిన మేకర్స్ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పైరసీని అరికట్టే విషయంలో కఠిన చర్యలు చేపట్టకపోతే మున్ముందు ఇండస్ట్రీ మనుగడకే ప్రమాదం వస్తుందని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
This post was last modified on February 8, 2025 6:58 pm
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో పోటాపోటీగా…
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…