ఏడు నెలల కరోనా విరామం తర్వాత ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ దేశంలో మెజారిటీ థియేటర్లు ఇంకా మూతపడే ఉన్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం అనుమతులిచ్చినా చాలా వరకు థియటర్లు తెరవలేదు. అందుకు కారణం 50 శాతం కెపాసిటీతో థియేటర్లు నడుపుకోవాలని షరతు విధించడం, అలాగే కొత్త సినిమాలేవీ విడుదల కాకపోవడం. సింగిల్ స్క్రీన్లు దాదాపుగా అన్నీ మూతపడే ఉన్నాయి.
మల్టీప్లెక్సుల్లో కూడా పెద్ద సంస్థలు మాత్రమే స్క్రీన్లను తెరిచాయి. కానీ వాటిలో సినిమాలు నామమాత్రంగానే నడుస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో థియేటర్ల మెయింటైనెన్స్ ఎలా?
ఇందుకే ఐనాక్స్ సంస్థ వినూత్నమైన ఐడియాతో ముందుకొచ్చింది. తమ మల్టీప్లెక్సుల్లో స్క్రీన్లను జనాలకు అద్దెకివ్వాలని నిర్ణయించింది. మొత్తం స్క్రీన్ను బుక్ చేసుకుని ప్రైవేట్ స్క్రీనింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఐనాక్స్. అందులో కోరిన సినిమాలు కొత్తవైనా, పాతవైనా ప్రదర్శించుకోవచ్చు. అలాగే సినిమా వాళ్లు కూడా ఏవైనా మూవీ ఈవెంట్లు చేసుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గెట్ టు గెదర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. బర్త్ డే పార్టీలు, స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వహించుకోవచ్చు. వర్క్ షాప్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
ఎలాగూ స్క్రీన్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడు కొత్త సినిమాలు రిలీజవుతాయో తెలియదు. ఒకట్రెండు స్క్రీన్లలో నామమాత్రంగా సినిమాలను నడిపించి.. మిగతా వాటిని ఇలా ప్రైవేట్ స్క్రీనింగ్, ఈవెంట్ల కోసం ఇచ్చి.. ఒకప్పట్లా సినిమాలు నడిచే వరకు మెయింటైనెన్స్ అయినా రాబట్టుకోవాలని ఐనాక్స్ చూస్తున్నట్లుంది. ఈ పద్ధతిని మిగతా మల్టీప్లెక్స్ ఛైన్స్ కూడా అనుసరించే అవకాశముంది.
This post was last modified on October 20, 2020 4:56 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…