ఏడు నెలల కరోనా విరామం తర్వాత ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ దేశంలో మెజారిటీ థియేటర్లు ఇంకా మూతపడే ఉన్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం అనుమతులిచ్చినా చాలా వరకు థియటర్లు తెరవలేదు. అందుకు కారణం 50 శాతం కెపాసిటీతో థియేటర్లు నడుపుకోవాలని షరతు విధించడం, అలాగే కొత్త సినిమాలేవీ విడుదల కాకపోవడం. సింగిల్ స్క్రీన్లు దాదాపుగా అన్నీ మూతపడే ఉన్నాయి.
మల్టీప్లెక్సుల్లో కూడా పెద్ద సంస్థలు మాత్రమే స్క్రీన్లను తెరిచాయి. కానీ వాటిలో సినిమాలు నామమాత్రంగానే నడుస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో థియేటర్ల మెయింటైనెన్స్ ఎలా?
ఇందుకే ఐనాక్స్ సంస్థ వినూత్నమైన ఐడియాతో ముందుకొచ్చింది. తమ మల్టీప్లెక్సుల్లో స్క్రీన్లను జనాలకు అద్దెకివ్వాలని నిర్ణయించింది. మొత్తం స్క్రీన్ను బుక్ చేసుకుని ప్రైవేట్ స్క్రీనింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఐనాక్స్. అందులో కోరిన సినిమాలు కొత్తవైనా, పాతవైనా ప్రదర్శించుకోవచ్చు. అలాగే సినిమా వాళ్లు కూడా ఏవైనా మూవీ ఈవెంట్లు చేసుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గెట్ టు గెదర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. బర్త్ డే పార్టీలు, స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వహించుకోవచ్చు. వర్క్ షాప్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
ఎలాగూ స్క్రీన్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడు కొత్త సినిమాలు రిలీజవుతాయో తెలియదు. ఒకట్రెండు స్క్రీన్లలో నామమాత్రంగా సినిమాలను నడిపించి.. మిగతా వాటిని ఇలా ప్రైవేట్ స్క్రీనింగ్, ఈవెంట్ల కోసం ఇచ్చి.. ఒకప్పట్లా సినిమాలు నడిచే వరకు మెయింటైనెన్స్ అయినా రాబట్టుకోవాలని ఐనాక్స్ చూస్తున్నట్లుంది. ఈ పద్ధతిని మిగతా మల్టీప్లెక్స్ ఛైన్స్ కూడా అనుసరించే అవకాశముంది.
This post was last modified on October 20, 2020 4:56 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…