దాదాపు ఏడు నెలల నిరీక్షణకు ఇంకో రెండు రోజుల్లో తెరపడబోతోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం రిలీజ్ చేసిన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ ఎంతగా అలరించిందో తెలిసిందే. అది రిలీజైన దగ్గర్నుంచి ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ కోసం చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మామూలుగా అయితే తారక్ పుట్టిన రోజైన మే 20న ఈ టీజర్ రావాల్సింది. కానీ కరోనా దెబ్బకు టీజర్కు విజువల్స్ తీసే అవకాశం లేకపోవడంతో జక్కన్న ఊరుకుండిపోయాడు.
చూస్తుండగానే నెలలు నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకు ఈ నెల ఆరంభంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ పున:ప్రారంభం అయింది. ముందు చెప్పినట్లే షూటింగ్ పున:ప్రారంభం కావడం ఆలస్యం.. టీజర్ కోసం అవసరమైన విజువల్స్ తీసేశాడు జక్కన్న. తర్వాత బ్రేక్ తీసుకుని ఆ టీజర్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు.
ఈ నెల 22న ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ రాబోతోంది. దీని గురించి కొన్ని రోజులుగా కౌంట్డౌన్తో ఊరిస్తూ వస్తోంది ఆర్ఆర్ఆర్ టీం. రోజు రోజుకూ దానిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముందు డేట్ మాత్రమే చెప్పిన చిత్ర బృందం.. టీజర్ రిలీజ్ టైం కూడా వెల్లడించింది. గురువారం ఉదయం 11 గంటలకు ఆ టీజర్ రాబోతోంది. ఇక టీజర్లో తారక్ ఎలా కనిపిస్తాడు.. చరణ్ వాయిస్ ఓవర్ ఎలా ఉంటుంది అనే విషయాల్లో ఆయా హీరోల అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు.
రామరాజు టీజర్లో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోగా.. తారక్ వాయిస్ ఓవర్ అదే స్థాయిలో ప్రశంసలందుకుంది. భీమ్ టీజర్లో తారక్ బీస్ట్ అవతార్లో కనిపిస్తాడని అంటున్నారు. చరణ్ వాయిస్ ఓవర్ కూడా వావ్ అనిపించేలా ఉంటుందని.. పవర్ ఫుల్ డైలాగ్స్ పడ్డాయని చెప్పుకుంటున్నారు. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ మీదా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ అంచనాల్ని చిత్ర బృందం ఏమేర అందుకుంటుందో చూడాలి.
This post was last modified on October 20, 2020 4:28 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…