దాదాపు ఏడు నెలల నిరీక్షణకు ఇంకో రెండు రోజుల్లో తెరపడబోతోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం రిలీజ్ చేసిన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ ఎంతగా అలరించిందో తెలిసిందే. అది రిలీజైన దగ్గర్నుంచి ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ కోసం చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మామూలుగా అయితే తారక్ పుట్టిన రోజైన మే 20న ఈ టీజర్ రావాల్సింది. కానీ కరోనా దెబ్బకు టీజర్కు విజువల్స్ తీసే అవకాశం లేకపోవడంతో జక్కన్న ఊరుకుండిపోయాడు.
చూస్తుండగానే నెలలు నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకు ఈ నెల ఆరంభంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ పున:ప్రారంభం అయింది. ముందు చెప్పినట్లే షూటింగ్ పున:ప్రారంభం కావడం ఆలస్యం.. టీజర్ కోసం అవసరమైన విజువల్స్ తీసేశాడు జక్కన్న. తర్వాత బ్రేక్ తీసుకుని ఆ టీజర్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు.
ఈ నెల 22న ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ రాబోతోంది. దీని గురించి కొన్ని రోజులుగా కౌంట్డౌన్తో ఊరిస్తూ వస్తోంది ఆర్ఆర్ఆర్ టీం. రోజు రోజుకూ దానిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముందు డేట్ మాత్రమే చెప్పిన చిత్ర బృందం.. టీజర్ రిలీజ్ టైం కూడా వెల్లడించింది. గురువారం ఉదయం 11 గంటలకు ఆ టీజర్ రాబోతోంది. ఇక టీజర్లో తారక్ ఎలా కనిపిస్తాడు.. చరణ్ వాయిస్ ఓవర్ ఎలా ఉంటుంది అనే విషయాల్లో ఆయా హీరోల అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు.
రామరాజు టీజర్లో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోగా.. తారక్ వాయిస్ ఓవర్ అదే స్థాయిలో ప్రశంసలందుకుంది. భీమ్ టీజర్లో తారక్ బీస్ట్ అవతార్లో కనిపిస్తాడని అంటున్నారు. చరణ్ వాయిస్ ఓవర్ కూడా వావ్ అనిపించేలా ఉంటుందని.. పవర్ ఫుల్ డైలాగ్స్ పడ్డాయని చెప్పుకుంటున్నారు. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ మీదా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ అంచనాల్ని చిత్ర బృందం ఏమేర అందుకుంటుందో చూడాలి.
This post was last modified on October 20, 2020 4:28 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…