దాదాపు ఏడు నెలల నిరీక్షణకు ఇంకో రెండు రోజుల్లో తెరపడబోతోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం రిలీజ్ చేసిన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ ఎంతగా అలరించిందో తెలిసిందే. అది రిలీజైన దగ్గర్నుంచి ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ కోసం చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మామూలుగా అయితే తారక్ పుట్టిన రోజైన మే 20న ఈ టీజర్ రావాల్సింది. కానీ కరోనా దెబ్బకు టీజర్కు విజువల్స్ తీసే అవకాశం లేకపోవడంతో జక్కన్న ఊరుకుండిపోయాడు.
చూస్తుండగానే నెలలు నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకు ఈ నెల ఆరంభంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ పున:ప్రారంభం అయింది. ముందు చెప్పినట్లే షూటింగ్ పున:ప్రారంభం కావడం ఆలస్యం.. టీజర్ కోసం అవసరమైన విజువల్స్ తీసేశాడు జక్కన్న. తర్వాత బ్రేక్ తీసుకుని ఆ టీజర్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు.
ఈ నెల 22న ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ రాబోతోంది. దీని గురించి కొన్ని రోజులుగా కౌంట్డౌన్తో ఊరిస్తూ వస్తోంది ఆర్ఆర్ఆర్ టీం. రోజు రోజుకూ దానిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముందు డేట్ మాత్రమే చెప్పిన చిత్ర బృందం.. టీజర్ రిలీజ్ టైం కూడా వెల్లడించింది. గురువారం ఉదయం 11 గంటలకు ఆ టీజర్ రాబోతోంది. ఇక టీజర్లో తారక్ ఎలా కనిపిస్తాడు.. చరణ్ వాయిస్ ఓవర్ ఎలా ఉంటుంది అనే విషయాల్లో ఆయా హీరోల అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు.
రామరాజు టీజర్లో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోగా.. తారక్ వాయిస్ ఓవర్ అదే స్థాయిలో ప్రశంసలందుకుంది. భీమ్ టీజర్లో తారక్ బీస్ట్ అవతార్లో కనిపిస్తాడని అంటున్నారు. చరణ్ వాయిస్ ఓవర్ కూడా వావ్ అనిపించేలా ఉంటుందని.. పవర్ ఫుల్ డైలాగ్స్ పడ్డాయని చెప్పుకుంటున్నారు. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ మీదా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ అంచనాల్ని చిత్ర బృందం ఏమేర అందుకుంటుందో చూడాలి.
This post was last modified on October 20, 2020 4:28 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…