‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది. హాలీవుడ్ ప్రముఖులతో ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తర్వాత తారక్, చరణ్ విదేశాలకు వెళ్లినా గుర్తు పడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వారి రెఫరెన్సులు ఉంటున్నాయి.
తాజాగా ఫిఫా లాంటి అతి పెద్ద క్రీడా సంస్థ ఎన్టీఆర్ రెఫరెన్సుతో పోస్టు పెట్టడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 50 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగిన ఫిఫా ఇన్స్టాగ్రామ్ పేజీలో.. ఒకే రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న స్టార్ ఫుట్ బాలర్లు నెయ్మార్, టెవెజ్, రొనాల్డోలకు శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్ పెట్టారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ ముగ్గురూ కలిపి ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తున్నట్లుగా క్యారికేచర్ వేయించడమే కాక.. ఆ ముగ్గురి పేర్లలో మొదటి ఇంగ్లిష్ అక్షరం తీసుకుని ‘NTR’ అనే కామెంట్ కూడా జోడించారు.
‘నాటు నాటు’ పాటను ప్రస్తావించడమే విశేషం అంటే.. అందులో చరణ్తో కలిసి డ్యాన్స్ చేసిన ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చేలా.. ముగ్గురు ఫుట్బాలర్ల పేర్లలోని మొదటి అక్షరాలతో కామెంట్ పెట్టడం మరింత ఆశ్చర్యం. ఇది తారక్ అభిమానులను అమితానందానికి గురి చేసింది. స్వయంగా తారక్ కూడా ఈ పోస్టు మీద స్పందించాడు.
పోస్టుపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. నెయ్మార్, టెవెజ్, రొనాల్డోలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా.. నాటు నాటు పాట అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు పొందాయో.. తారక్, చరణ్లకు ఎంత పాపులారిటీ తెచ్చిపెట్టాయో చెప్పడానికి ఈ పోస్టు తాజా ఉదాహరణ.
This post was last modified on February 5, 2025 5:26 pm
కొందరు నాయకులు తాము ఎదుగుతూ.. తోటి వారిని ఎదిగేలా సహకరిస్తారు. ఇది ఎక్కడైనా ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో…
ఏపీలో ఒకేసారి రెండు కీలక సమస్యలు రాష్ట్రంలో అలజడి రేపుతున్నాయి. ఈ రెండు కూడా సాధారణ ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు…
టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో జింబాబ్వేపై 72 పరుగుల…
వైసీపీ హయాంలో జరిగిన మద్యం అక్రమాలకు సంబంధించి ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు తాజాగా మరో…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యను రాజకీయం చేయదల్చుకోలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు…
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ సీఈఆర్టీ సంస్థ.. 8వ తరగతి పాఠ్య పుస్తకంలో కొత్తగా చేర్చిన ఓ పాఠం దేశాన్ని…