‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది. హాలీవుడ్ ప్రముఖులతో ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తర్వాత తారక్, చరణ్ విదేశాలకు వెళ్లినా గుర్తు పడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వారి రెఫరెన్సులు ఉంటున్నాయి.
తాజాగా ఫిఫా లాంటి అతి పెద్ద క్రీడా సంస్థ ఎన్టీఆర్ రెఫరెన్సుతో పోస్టు పెట్టడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 50 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగిన ఫిఫా ఇన్స్టాగ్రామ్ పేజీలో.. ఒకే రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న స్టార్ ఫుట్ బాలర్లు నెయ్మార్, టెవెజ్, రొనాల్డోలకు శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్ పెట్టారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ ముగ్గురూ కలిపి ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తున్నట్లుగా క్యారికేచర్ వేయించడమే కాక.. ఆ ముగ్గురి పేర్లలో మొదటి ఇంగ్లిష్ అక్షరం తీసుకుని ‘NTR’ అనే కామెంట్ కూడా జోడించారు.
‘నాటు నాటు’ పాటను ప్రస్తావించడమే విశేషం అంటే.. అందులో చరణ్తో కలిసి డ్యాన్స్ చేసిన ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చేలా.. ముగ్గురు ఫుట్బాలర్ల పేర్లలోని మొదటి అక్షరాలతో కామెంట్ పెట్టడం మరింత ఆశ్చర్యం. ఇది తారక్ అభిమానులను అమితానందానికి గురి చేసింది. స్వయంగా తారక్ కూడా ఈ పోస్టు మీద స్పందించాడు.
పోస్టుపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. నెయ్మార్, టెవెజ్, రొనాల్డోలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా.. నాటు నాటు పాట అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు పొందాయో.. తారక్, చరణ్లకు ఎంత పాపులారిటీ తెచ్చిపెట్టాయో చెప్పడానికి ఈ పోస్టు తాజా ఉదాహరణ.
This post was last modified on February 5, 2025 5:26 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…