‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది. హాలీవుడ్ ప్రముఖులతో ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తర్వాత తారక్, చరణ్ విదేశాలకు వెళ్లినా గుర్తు పడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వారి రెఫరెన్సులు ఉంటున్నాయి.
తాజాగా ఫిఫా లాంటి అతి పెద్ద క్రీడా సంస్థ ఎన్టీఆర్ రెఫరెన్సుతో పోస్టు పెట్టడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 50 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగిన ఫిఫా ఇన్స్టాగ్రామ్ పేజీలో.. ఒకే రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న స్టార్ ఫుట్ బాలర్లు నెయ్మార్, టెవెజ్, రొనాల్డోలకు శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్ పెట్టారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ ముగ్గురూ కలిపి ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తున్నట్లుగా క్యారికేచర్ వేయించడమే కాక.. ఆ ముగ్గురి పేర్లలో మొదటి ఇంగ్లిష్ అక్షరం తీసుకుని ‘NTR’ అనే కామెంట్ కూడా జోడించారు.
‘నాటు నాటు’ పాటను ప్రస్తావించడమే విశేషం అంటే.. అందులో చరణ్తో కలిసి డ్యాన్స్ చేసిన ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చేలా.. ముగ్గురు ఫుట్బాలర్ల పేర్లలోని మొదటి అక్షరాలతో కామెంట్ పెట్టడం మరింత ఆశ్చర్యం. ఇది తారక్ అభిమానులను అమితానందానికి గురి చేసింది. స్వయంగా తారక్ కూడా ఈ పోస్టు మీద స్పందించాడు.
పోస్టుపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. నెయ్మార్, టెవెజ్, రొనాల్డోలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా.. నాటు నాటు పాట అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు పొందాయో.. తారక్, చరణ్లకు ఎంత పాపులారిటీ తెచ్చిపెట్టాయో చెప్పడానికి ఈ పోస్టు తాజా ఉదాహరణ.
This post was last modified on February 5, 2025 5:26 pm
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…