గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా కంటే ముందు ఈ జోడీ ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అదే.. జాంబి రెడ్డి. తెలుగులో అరుదు అనదగ్గ జాంబీ జానర్కు రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ జోడించి ప్రశాంత్ రూపొందించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది.
దీనికి కొనసాగింపుగా జాంబిరెడ్డి-2 తీస్తానని ప్రశాంత్ అప్పట్లోనే చెప్పాడు. కానీ తర్వాత ఏ అప్డేట్ లేదు. ఎట్టకేలకు ఇప్పుడు జాంబిరెడ్డి-2 అప్డేట్ వచ్చింది. అతి త్వరలోనే సీక్వెల్ సెట్స్ మీదికి వెళ్లోబోతోంది. ఐతే జాంబి రెడ్డి-2ను ప్రశాంత్ డైరెక్ట్ చేయట్లేదు. ఈ బాధ్యతలను బాలీవుడ్ డైరెక్టర్ సుపర్ణ్ వర్మకు అప్పగించారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో కొన్ని ఎపిసోడ్లను.. అలాగే రానా దగ్గుబాటి-విక్టరీ వెంకటేష్ కలయికలో వచ్చిన ‘రానా నాయుడు’ సిరీస్ను డైరెక్ట్ చేసిన సుపర్ణ్ వర్మ.. ‘జాంబిరెడ్డి’ దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నాడు.
ఐతే ఈ చిత్రానికి స్క్రిప్టు అందించడంతో పాటు షో రన్నర్గా ప్రశాంత్ వర్మే వ్యవహరించబోతున్నాడు. ‘హనుమాన్’తో తేజ సజ్జకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో బహు భాషల్లో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో మంచి ఊపు మీదున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.
కొంచెం పెద్ద బడ్జెట్లోనే సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం తేజ నటిస్తున్న సూపర్ హీరో మూవీ ‘మిరాయ్’ చివరి దశలో ఉంది. అది పూర్తి కాగానే ‘జాంబిరెడ్డి-2’ చిత్రీకరణలో పాల్గొంటాడు తేజ. త్వరలోనే కాస్ట్ అండ్ క్రూ గురించి పూర్తి వివరాలు వెల్లడవుతాయి.
This post was last modified on February 5, 2025 1:49 pm
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…
సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో శ్రీవిష్ణు రెండు సినిమాలు రిలీజ్ కానుండటం గురించి అభిమానుల కంటే ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్…