గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా కంటే ముందు ఈ జోడీ ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అదే.. జాంబి రెడ్డి. తెలుగులో అరుదు అనదగ్గ జాంబీ జానర్కు రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ జోడించి ప్రశాంత్ రూపొందించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది.
దీనికి కొనసాగింపుగా జాంబిరెడ్డి-2 తీస్తానని ప్రశాంత్ అప్పట్లోనే చెప్పాడు. కానీ తర్వాత ఏ అప్డేట్ లేదు. ఎట్టకేలకు ఇప్పుడు జాంబిరెడ్డి-2 అప్డేట్ వచ్చింది. అతి త్వరలోనే సీక్వెల్ సెట్స్ మీదికి వెళ్లోబోతోంది. ఐతే జాంబి రెడ్డి-2ను ప్రశాంత్ డైరెక్ట్ చేయట్లేదు. ఈ బాధ్యతలను బాలీవుడ్ డైరెక్టర్ సుపర్ణ్ వర్మకు అప్పగించారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో కొన్ని ఎపిసోడ్లను.. అలాగే రానా దగ్గుబాటి-విక్టరీ వెంకటేష్ కలయికలో వచ్చిన ‘రానా నాయుడు’ సిరీస్ను డైరెక్ట్ చేసిన సుపర్ణ్ వర్మ.. ‘జాంబిరెడ్డి’ దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నాడు.
ఐతే ఈ చిత్రానికి స్క్రిప్టు అందించడంతో పాటు షో రన్నర్గా ప్రశాంత్ వర్మే వ్యవహరించబోతున్నాడు. ‘హనుమాన్’తో తేజ సజ్జకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో బహు భాషల్లో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో మంచి ఊపు మీదున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.
కొంచెం పెద్ద బడ్జెట్లోనే సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం తేజ నటిస్తున్న సూపర్ హీరో మూవీ ‘మిరాయ్’ చివరి దశలో ఉంది. అది పూర్తి కాగానే ‘జాంబిరెడ్డి-2’ చిత్రీకరణలో పాల్గొంటాడు తేజ. త్వరలోనే కాస్ట్ అండ్ క్రూ గురించి పూర్తి వివరాలు వెల్లడవుతాయి.
This post was last modified on February 5, 2025 1:49 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…